దేశ రాజధానిలో వ్యాపారిపై కాల్పులు

దేశరాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం రేపాయి. స్ధానిక సివిల్ లైన్స్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  పోలీసుల ప్రకారం గురువారం ఉదయం ప్రామినెంట్ డిటర్జెంట్ బ్రాండ్‌‌కు చెందిన వ్యాపారి రాహుల్.. సివిల్ లైన్స్‌లో ప్రాంతంలో గల ఓ జిమ్ నుంచి బయటకు వస్తుండగా దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో వ్యాపారి అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. దీంతోొ బాధితుడ్ని వెంటనే అక్కడికి దగ్గర్లో గల పరమానంద హాస్పిటల్‌కి తరలించారు. ఉదయాన్నే జరిగిన ఈ కాల్పులతో స్ధానికంగా కలకలం రేగింది. అయితే […]

దేశ రాజధానిలో వ్యాపారిపై  కాల్పులు

Edited By:

Updated on: Jul 25, 2019 | 7:08 PM

దేశరాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం రేపాయి. స్ధానిక సివిల్ లైన్స్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  పోలీసుల ప్రకారం గురువారం ఉదయం ప్రామినెంట్ డిటర్జెంట్ బ్రాండ్‌‌కు చెందిన వ్యాపారి రాహుల్.. సివిల్ లైన్స్‌లో ప్రాంతంలో గల ఓ జిమ్ నుంచి బయటకు వస్తుండగా దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో వ్యాపారి అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. దీంతోొ బాధితుడ్ని వెంటనే అక్కడికి దగ్గర్లో గల పరమానంద హాస్పిటల్‌కి తరలించారు. ఉదయాన్నే జరిగిన ఈ కాల్పులతో స్ధానికంగా కలకలం రేగింది. అయితే బాధితుడు రాహుల్ పరిస్థితి బాగానే ఉందని, కాల్పులకు తెగబడ్డ దుండగుడ్ని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. కాల్పులకు కారణాలు ఏమై ఉంటాయనే విషయాన్ని దర్యాప్తు చేస్తున్నట్టుగా వారు చెప్పారు.

Loading...
Unable to load recommendations.
Follow Us