ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ ఇచ్చిన హామీల అమలులో మరో ముందడుగు పడింది. అగ్రిగోల్డ్ బాధితులకు తొలి విడతగా చెల్లింపులు జరపనుంది ఏపీ సర్కారు. 10 వేల లోపు డిపాజిటర్లకు మొదటి విడతా పేమెంట్లు ఇవ్వనున్నారు. మూడు లక్షల 69 వేల మందికి 263 కోట్ల రూపాయలు పంపిణీ చేయనుంది ప్రభుత్వం.
హైకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా లీగల్ సెల్ ద్వారా నగదు అందజేయనుంది. మరో వైపు 20 వేల రూపాయల లోపు డిపాజిటర్లకు కూడా చెల్లించేందుకు రెండు విడత కోసం సన్నాహాలు చేస్తోంది. కోర్టు సూచనల మేరకు చెల్లింపులు చేయబోతున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బు ఇవ్వడానికి వీలుగా తొలి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో 1150 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ మొత్తం నుంచి బాధితులకు డబ్బులు ఇవ్వబోతుంది ప్రభుత్వం.
సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా ప్రతీ జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితులు సీఎం జగన్ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పనులు చేసుకునే వారు సహా వేలాది మంది మధ్య తరగతి జనం అగ్రిగోల్డ్లో తమ డబ్బు డిపాజిట్ చేశారు. మోసపోయామని తెలిసి.. తమకు రావాల్సిన మొత్తాన్ని ఇప్పించాలని.. పాదయాత్రలో జగన్ను కోరారు బాధితులు.
10వేల లోపు వారికి ఊరట..
పది వేల రూపాయలలోపు డిపాజిటర్లకు కలెక్టర్ల ద్వారా నగదు అందించబోతుంది ప్రభుత్వం. జిల్లాల వారిగా బాధితులు.. వారికి అందే మొత్తాన్ని పరిశీలిస్తే..