AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీ కేన్సర్ ఆసుపత్రి నర్సులకూ కరోనా..

ఢిల్లీలోని కేన్సర్ ఇన్స్ టి ట్యూట్ ఆసుపత్రిలో ఒక డాక్టర్ సహా 11 మంది నర్సులకు కూడా కరోనా వైరస్ సోకింది. ఇందులోని రోగులతో బాటు మొత్తం 18 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. గతవారం ఈ డాక్టర్ కి కరోనా వైరస్ సోకడంతో ఆసుపత్రిని మూసివేశారు.

ఢిల్లీ కేన్సర్ ఆసుపత్రి నర్సులకూ కరోనా..
Umakanth Rao
| Edited By: |

Updated on: Apr 07, 2020 | 11:29 AM

Share

ఢిల్లీలోని కేన్సర్ ఇన్స్ టి ట్యూట్ ఆసుపత్రిలో ఒక డాక్టర్ సహా 11 మంది నర్సులకు కూడా కరోనా వైరస్ సోకింది. ఇందులోని రోగులతో బాటు మొత్తం 18 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. గతవారం ఈ డాక్టర్ కి కరోనా వైరస్ సోకడంతో ఆసుపత్రిని మూసివేశారు. అయితే అప్పటికే ఆరుగురు నర్సులకు, ఆ తరువాత మరో ఐదుగురికి కూడా ఈ వైరస్ సోకింది. ఈ వైద్యశాల లోని 19 మంది రోగుల సాంపిల్స్ ను కరోనా టెస్టులకోసం పంపారు. ఇక్కడి డాక్టర్ కుటుంబ సభ్యులు ఇటీవలే బ్రిటన్ నుంచి తిరిగి వచ్చారని, వారి ద్వారా ఆ డాక్టర్ కు, ఆయన నుంచి నర్సులకూ ఇది వ్యాపించిందని తెలుస్తోంది. ఆసుపత్రి సిబ్బందిలో 45 మందిని క్వారంటైన్ కి తరలించారు. వీరిలో ఇంత త్వరగా ఈ వైరస్ ఎలా వ్యాపించిందన్న దానిపై హాస్పిటల్ యాజమాన్యం విచారణ జరుపుతోంది. కాగా ఢిల్లీ ప్రభుత్వం మొహల్లాలో నిర్వహించే ఓ  క్లినిక్ లో ఇద్దరు డాక్టర్ దంపతులకు కరోనా సోకిందని, సౌదీ వెళ్లి వఛ్చిన ఒక రోగి నుంచి వారికి ఇది అంటుకుందని తెలుస్తోంది. అటు -ముంబైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ముగ్గురు డాక్టర్లకు, 26 మంది నర్సులకు కూడా ఈ వైరస్ సోకడంతో ఆ హాస్పిటల్ ని కూడా మూసివేసిన సంగతి తెలిసిందే.