Bigg Boss 4: దేవి, లాస్య కామెంట్లు.. నా వల్ల కాదంటూ ఏడ్చేసిన అమ్మ రాజశేఖర్‌

| Edited By:

Sep 19, 2020 | 6:46 PM

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ రెండో వారంలో ఐదు రోజులు గడిచాయి. ఈ వారంలో ఇద్దరు వైల్డ్ కార్డు ద్వారా లోపలికి ఎంట్రీ ఇచ్చారు

Bigg Boss 4: దేవి, లాస్య కామెంట్లు.. నా వల్ల కాదంటూ ఏడ్చేసిన అమ్మ రాజశేఖర్‌
Follow us on

Bigg Boss 4 promo: బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ రెండో వారంలో ఐదు రోజులు గడిచాయి. ఈ వారంలో ఇద్దరు వైల్డ్ కార్డు ద్వారా లోపలికి ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఎంటర్‌టైన్‌మెంట్‌ డోస్ కూడా కాస్త పెరిగింది. ఇక ఇవాళ, రేపు వ్యాఖ్యత నాగార్జునతో స్పెషల్ ఎపిసోడ్‌లు ఉంటాయి. కంటెస్టెంట్‌ల బిహేవియర్‌ని బట్టి నాగార్జున గట్టి క్లాస్ పీకేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఈ రోజు ప్రసారం కానున్న ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోలు విడుదల అయ్యాయి. అందులో కంటెస్టెంట్‌లపై విరుచుకుపడ్డారు నాగ్‌. బిగ్‌బాస్ చెప్పిన ఆదేశాలను పట్టించుకోకుండా, బిగ్‌బాస్‌పై పాటలు పాడటాన్ని ఆయన తప్పుపట్టారు. సేఫ్ గేమ్ ఆడాలనుకుంటున్నారా..? అలా జరగనివ్వనని హెచ్చరించారు.

ఇక మరో ప్రోమోలో టీమ్‌లో జీరో అనుకున్న వాళ్లను గేటు నుంచి పంపేయండని నాగ్ సూచించగా.. దేవి మొదట అమ్మ రాజశేఖర్‌ని తీసుకెళ్లింది. అంతేకాదు కామెడీ చేస్తే హీరోలు అవుతారా..? అంటూ ప్రశ్నించింది. ఆ తరువాత లాస్య కూడా అమ్మ రాజశేఖర్‌ని అందులోకి తీసుకెళ్లి.. శ్రుతి మించిన కామెడీని నేను తీసుకోలేను సర్ అని కామెంట్ చేసింది. దీంతో మాస్టర్ తాను వెళ్లిపోతానని నాగ్‌ని కోరారు. దయచేసి నన్ను పంపండి అంటూ చేతులెత్తి మొక్కుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని ఓదార్చారు. ఇక గంగవ్వ, మాస్టర్ ఉండాల్సిందేనంటూ నాగార్జునకు తేల్చి చెప్పింది.

Read More:

‘కుమారి’ కొత్త అవతారం.. చూస్తే షాక్ అవ్వాల్సిందే

Bigg Boss 4: రెమ్యునరేషన్‌పై సూర్య కిరణ్ షాకింగ్ కామెంట్లు