మోదీతో సెల్ఫీ దిగిన ఆసీస్ ప్రధాని…
ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ భారత ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ ఎక్కడికి వెళ్లినా అందరూ.. సెల్ఫీలకు ఎగబడుతూ ఉంటారు. ఆయన కూడా వారిని నిరాశ పరుచకుండా.. వారితో సెల్ఫీకి ఫోజ్ ఇంస్తుంటారు. అయితే జీ-20 సమ్మిట్లో భాగంగా అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఆసీస్ ప్రధాని మోదీతో కలిసి సెల్ఫీ దిగారు. అంతేకాదు ఆ ఫోటోను.. ఆయన అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దానికి “కిత్నా అచ్చా హై మోదీ” అంటూ క్యాప్షన్ కూడా […]
ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ భారత ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ ఎక్కడికి వెళ్లినా అందరూ.. సెల్ఫీలకు ఎగబడుతూ ఉంటారు. ఆయన కూడా వారిని నిరాశ పరుచకుండా.. వారితో సెల్ఫీకి ఫోజ్ ఇంస్తుంటారు. అయితే జీ-20 సమ్మిట్లో భాగంగా అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఆసీస్ ప్రధాని మోదీతో కలిసి సెల్ఫీ దిగారు. అంతేకాదు ఆ ఫోటోను.. ఆయన అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దానికి “కిత్నా అచ్చా హై మోదీ” అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. అయితే మారిసన్ ట్వీట్కు మోదీ కూడా రిప్లై ఇచ్చారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచుకునే చర్చకై ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నానంటూ ట్వీట్లో పేర్కొన్నారు. మారిసన్ చేసిన ట్వీట్ గంటల్లోనే వైరల్గా మారింది. ఆ తర్వాత ఇద్దరు ప్రధానులు ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్పై నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఇరు ప్రధానుల కూడా మంచివారేనంటూ కొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు.
Kithana acha he Modi! #G20OsakaSummit pic.twitter.com/BC6DyuX4lf
— Scott Morrison (@ScottMorrisonMP) June 28, 2019
Mate, I’m stoked about the energy of our bilateral relationship! @ScottMorrisonMP https://t.co/RdvaWsqlwY
— Narendra Modi (@narendramodi) June 29, 2019