East Godavari: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తపై దుండగులు దాడి.. గతంలో ఎమ్మెల్యే రాపాక నుంచి ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు…

|

Mar 06, 2022 | 7:51 AM

East Godavari: తూర్పుగోదావరి జిలాల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మలికిపురం మండలం(Malkipuram Mandal )లోని  చింతలమోరి (Chintalamori )లో పట్టపగలు దారుణం జరిగింది.  వైసీపీ సోషల్ మీడియా(YCP Social Media)..

East Godavari: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తపై దుండగులు దాడి.. గతంలో ఎమ్మెల్యే రాపాక నుంచి ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు...
Ycp Social Media Leader
Follow us on

East Godavari: తూర్పుగోదావరి జిలాల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మలికిపురం మండలం(Malkipuram Mandal )లోని  చింతలమోరి (Chintalamori )లో పట్టపగలు దారుణం జరిగింది.  వైసీపీ సోషల్ మీడియా(YCP Social Media) కార్యకర్త కిరణ్ పై ముసుగులు ధరించిన నలుగురు వ్యక్తులు కర్రలతో, కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన కిరణ్ అపస్మారక స్థితికి వెళ్ళాడు. క్షతగాత్రుడిని వెంటనే బంధువులు రాజోలు ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు కిరణ్ కు ప్రాధమిక  చికిత్సనందించారు. పరిస్థితి ఆందోళన కరంగా ఉండడంతో.. మెరుగైన వైద్యం కోసం రాజోలు వైద్య సిబ్బంది కిరణ్ ను కాకినాడ ప్రైవేట్ హాస్పిటల్ కి రిఫర్ చేశారు. అయితే కిరణ్ పై దాడి చేసిన ఘటనా స్థలంలో దుండుగులు మోటర్ బైక్ ను వదిలి పారిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే కిరణ్ గతంలో తనకు జనసేన ఎమ్మెల్యే రాపాక వల్ల ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read:

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం..

రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో గోధుమల ధర పెరగనుందా.. ?

ఉక్రెయిన్‌పై ఆగని బాంబుల వర్షం..దద్దరిల్లుతున్న పట్టణాలు.. కుప్పకూలుతున్న భవనాలు..