గుంటూరులోని పొగాకు బోర్డు ఛైర్మన్గా యడ్లపాటి రఘునాథ్బాబు బుధవారం బోర్డు కార్యాలయంలో ఫైల్స్పై సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ, మాజీ ఎంపీలు డాక్టర్ ఎలమంచిలి శివాజీ, కంబంపాటి హరిబాబు, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, బాలవీరాంజనేయులు, బీజేపీ నాయకులు ఆయనకు పుష్పగుచ్ఛాలందించి అభినందనలు తెలిపారు. అనంతరం రఘునాథ్బాబు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తనపై నమ్మకంతో అప్పచెప్పిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి రైతుల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.