
ఈ హెల్మెట్ వాహనదారుడ్ని ఎలా అలర్ట్ చేస్తుందంటే.. హెల్మెట్ పెట్టుకోనిదే ఆ బైక్ స్టార్ట్ కాదు.. అలాగే మద్యం సేవించి డ్రైవ్ చేయాలని ప్రయత్నించినా బైక్ స్టార్ట్ అవదు. అంతేకాదు.. ఎప్పుడైనా వాహనదారుడికి ప్రమాదం జరిగితే వెంటనే సహాయం కోసం పోలీసులకు మెసేజ్ వెళ్తుంది. ఈవిధంగా బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేస్తూ హెల్మెట్ను తయారు చేసారు ఈ టీచర్. టెక్నాలజీని చక్కగా ఉపయోగించారు టీచర్ విజయ భార్గవి. అవును శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలోని రేకులకుంట గ్రామ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్నారు విజయ భార్గవి. తన భర్త హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడుపుతూ యాక్సిడెంట్కు గురై చిన్న గాయాలతో బయటపడటంతో తనలో ఈ ఆలోచన వచ్చిందని భార్గవి తెలిపారు.
తనకు తెలిసిన టెక్నాలజీతోనే తన భర్త ఉపయోగించే హెల్మెట్కు ఈ ఏర్పాటు చేశానని, ప్రమాదానికి గురైతే సమీప పోలీస్ స్టెషన్ కు మెసేజ్ వెళ్ళే విధంగా బైక్, హెల్మెట్ ను బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేస్తూ ఈ స్మార్ట్ హెల్మెట్ తయారు చేశానంటున్నారు ఉపాధ్యాయిని విజయభార్గవి. ఇలాంటి హెల్మెట్స్ అందరికి అందుబాటులో ఉండే విధంగా రూపకల్పన చేస్తే రోడ్డు ప్రమాదాలు కొంతవరకైనా నివారించవచ్చని, ప్రమాదాలకు గురైనవారికి తక్షణ సహాయం అందుతుందని అంటున్నారు భార్గవి. విద్యార్థులకు ఈ విధంగా పాఠాలు చెబుతూ..ప్రాక్టికల్గా చేసి చూపిస్తే వారిలో సృజనాత్మకత పెరుగుతుందని వివరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి