Nipah Virus: నిఫా అంటేనే ఎందుకు హడలిపోతున్నారు? తెలుగు రాష్ట్రాలకు ప్రమాదం పొంచి ఉందా.! అసలు దీని కథేంటి.?

నిఫా అటాక్ చేస్తే చావు తప్పదా? నిఫా పేరు చెబితేనే ఎందుకు హడలిపోతున్నారు? కరోనా కంటే నిఫా డేంజరా? తెలుగు

Nipah Virus: నిఫా అంటేనే ఎందుకు హడలిపోతున్నారు? తెలుగు రాష్ట్రాలకు ప్రమాదం పొంచి ఉందా.! అసలు దీని కథేంటి.?
Virus

Updated on: Sep 08, 2021 | 3:06 PM

Nipah Virus – AP – Telangana: నిఫా అటాక్ చేస్తే చావు తప్పదా? నిఫా పేరు చెబితేనే ఎందుకు హడలిపోతున్నారు? కరోనా కంటే నిఫా డేంజరా? తెలుగు రాష్ట్రాలకు నిఫా ప్రమాదం పొంచి ఉందా? ఇంతకీ ఈ నిఫా ఏంటి? దీని కథేంటి.. ఒకసారి చూద్దాం. నిఫా వైరస్ గబ్బిలాల నుంచి వ్యాపిస్తుందని నిఫుణులు చెబుతున్నారు. అంతేనా, దాదాపు ఐదు వందల రకాల వైరస్‌లకు గబ్బిలాలే కేంద్రంగా ఉన్నాయని అంటున్నారు. అయితే, అందులో ఒకట్రెండు మాత్రమే మనుషులపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు.

కరోనా కంటే డేంజర్ ఈ నిఫా వైరస్. అందుకే, నిఫా పేరు చెబితేనే జనంతోపాటు ప్రభుత్వాలు వణికిపోతున్నాయి. ఒకవేళ కరోనా మాదిరిగా నిఫా వైరస్ గాని స్ప్రెడ్ అయితే 40 నుంచి 70శాతం మంది మరణించే ఛాన్స్ ఉందంటున్నారు వైద్యులు. నిఫా వైరస్ లక్షణాలు కూడా కరోనా మాదిరిగానే ఉంటాయంటున్నారు నిపుణులు. జలుబు దగ్గుతోపాటు జ్వరం వస్తుందంటున్నారు. అయితే, కరోనా కంటే తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

అంతేకాదు, నిఫా వైరస్ సోకితే రోగి కోమాలోకి వెళ్లిపోయే ఛాన్స్ ఉంటుందని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. చిన్న పిల్లల పాలిట ఇది యమ డేంజర్ అని చెబుతున్నారు. ముల్లు పోయి కత్తి వచ్చే అన్నట్టుగా తయారైంది ఇప్పుడు పరిస్థితి. కరోనా కంటే మోస్ట్ డేంజర్ వైరస్ భయపెడుతున్నందున బీకేర్ ఫుల్ అంటున్నారు.

Read also: Yadadri miracles: యాదాద్రి అద్భుతాలు. లక్ష్మీ పుష్కరిణికి జలాలు.. వైటీడీఏ అధికారుల ట్రయల్ రన్

Loading...
Unable to load recommendations.
Follow Us