Andhra Pradesh: అడ్రస్‌ అంటూ వచ్చాడు, తెంచుకు పోయాడు.. వైరల్‌ అవుతోన్న సీసీ కెమెరా వీడియో.

పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా దొంగలు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు. ఒకప్పుడు రాత్రుళ్లు ఎవరీ లేని సమయంలో దోపిడీకి దిగే వారు ఇప్పుడు ఉదయాన్నే, అందరూ చూస్తుండగానే చెలరేగి పోతున్నారు. మెడలో నగలు ధరించిన మహిళలు కనిపిస్తే చాలు క్షణాల్లో తెంచుకుపోతున్నారు. మరీ ముఖ్యంగా..

Andhra Pradesh: అడ్రస్‌ అంటూ వచ్చాడు, తెంచుకు పోయాడు.. వైరల్‌ అవుతోన్న సీసీ కెమెరా వీడియో.
Chain Snatching Video

Updated on: Apr 20, 2023 | 6:53 PM

పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా దొంగలు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు. ఒకప్పుడు రాత్రుళ్లు ఎవరీ లేని సమయంలో దోపిడీకి దిగే వారు ఇప్పుడు ఉదయాన్నే, అందరూ చూస్తుండగానే చెలరేగి పోతున్నారు. మెడలో నగలు ధరించిన మహిళలు కనిపిస్తే చాలు క్షణాల్లో తెంచుకుపోతున్నారు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చైన్‌ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఘటనే ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. అనంతరం నరంగలోని 5వ రోడ్డులో మారెక్క అనే ఓ మహిళ గురువారం ఉదయం ఇంటి ముందు చీపురుతో వాకిలి ఊడుస్తోంది. ఇదే సమయంలో పల్సర్‌ బైక్‌పై ఇద్దరు వ్యక్తులు వచ్చి మారెక్క ఇంటి ముందు ఆగారు. అనంతరం వారిద్దిరీలో ఒక వ్యక్తి మారెక్క దగ్గరికీ వచ్చి ఏదో అడ్రస్‌ అడుగుతున్నట్లు నటించాడు. దీంతో నిజంగానే కావొచ్చన్నట్లు సదరు మహిళ అతడికి సమాధానం చెబుతోంది. రోడ్డుపై జనాలు ఎవరూ సంచరించడం లేదని కాన్ఫామ్‌ చేసుకున్న అతను ఒక్కసారిగా మారెక్క మెడలోని గొలుసును లాగేశాడు.

ఇవి కూడా చదవండి

అప్పటికే పారిపోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి బైక్‌ ఎక్కి ఇద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. ఇదంతా కేవలం క్షణాల్లోనే జరిగిపోయింది. దీంతో అసలేం జరిగిందో కూడా ఊహకందని మారెక్క దిగ్భ్రాంతికి గురైంది. మారెక్క మెడలోని గొలుసు రెండు తులలు ఉంటుందని వాపోయింది. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యింది. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్‌ ఆధారంగా విచారణ చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us