YS Jagan Key decision: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద ఇస్తోన్న ప్రోత్సాహకాన్ని పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పథకం కింద సాధారణ ప్రసవానికి రూ.3వేలు, సిజేరిన్కి వెయ్యి రూపాయలు ఇచ్చేవారు. అయితే సాధారణ ప్రసవానికి రూ.5వేలు, సిజేరిన్కి రూ.3వేలు పెంచుతూ ఆయన ఇవాళ నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ఆసుపత్రి సేవలు అధ్వాన్నంగా ఉన్న జిల్లాలపై దృష్టి పెట్టాలని అన్నారు. రెండు వారాల్లో ఆ ఆసుపత్రుల్లో పరిస్థితి మెరుగు పడాలని అధికారులను ఆదేశించారు. ఇక ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో అన్ని నిబంధనలు పాటించాలని.. 6 నెలల తర్వాత పరిస్థితులు మెరుగుపడకపోతే చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. జిల్లాల్లో ఆరోగ్య శ్రీ కో-ఆర్డినేషన్ బాధ్యతలు ఇకపై జేసీలకి అప్పగించాలని జగన్ స్పష్టం చేశారు.
Read More:
వాటికి నేను బాధ్యుడిని కాదు.. అజిత్ ప్రకటన
10వేల ఎకరాల భూమికి నీరు.. కార్తిపై సర్వాత్రా ప్రశంసలు