రైతు బిడ్డ ఆవేదన…చిన్న వయసులోనే ఆకాశమంత ఆలోచన?

చెరువులా మారిన పంట పొలాలు..పూర్తిగా జలమైన వ్యవసాయ క్షేత్రంలో ఓ రైతు బిడ్డ ఆవేదన...చిన్న వయసులోనే ఆకాశమంత ఆలోచనలతో తన గోడును వినిపించిన బడతడు.

రైతు బిడ్డ ఆవేదన...చిన్న వయసులోనే ఆకాశమంత ఆలోచన?

Updated on: Sep 21, 2020 | 11:44 AM

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు చెరువులు, కుంటలు పొంగిపోర్లుతున్నాయి. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు నీటమునిగిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షానికి కొన్ని ప్రాంతాల్లో పంటపొలాలు పూర్తిగా జలమయం అయ్యాయి. ఈ క్రమంలోనే ఓ రైతుకు చెందిన ఆరెకరాల భూమి కూడా నడుము లోతు వరద నీటిలో మునిగిపోయి చెరువును తలపిస్తోంది. మరో 15 రోజుల్లో కోతలు పట్టాల్సి ఉండగా..తమ పొలం మునిగిపోవడంపై ఆ రైతు కుమారుడు అరుణ్ తన ఆవేదన వ్యక్తం చేశాడు.

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం అరూర్ గ్రామానికి చెందిన ఓ రైతు కొడుకు అరుణ్. తమ వ్యవసాయ పొలంలో నిండిపోయిన వరద నీటిలో ఈదుతూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. పూర్తిగా జలమయమైన ఆరు ఎకరాల పొలాన్ని చూపిస్తూ తన గోడు వెలిబుచ్చాడు. వ్యవసాయాన్ని నమ్ముకుని ఆరుగాలం శ్రమించి కష్టపడి అప్పులు చేసి మరీ పంట పండిస్తే తీరా పంట చేతికొచ్చే సమయానికి భారీ వర్షాలు, వరదలతో ఆరు ఎకరాల్లో వేసుకున్న పంట పూర్తిగా నీట మునిగిందని వాపోయాడు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని జిల్లా కలెక్టర్‌ను వేడుకున్నాడు. మరోసారి ఇలా కాకుండా చూడాలని కలెక్టర్‌ను వేడుకున్నాడు.

Loading...
Unable to load recommendations.
Follow Us