AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం.. వీఆర్వో వ్యవస్థ రద్దులో ముందడుగు

తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం తయారైంది. 'ల్యాండ్  మేనేజ్​మెంట్​ అండ్​ అడ్మినిస్ట్రేషన్​ యాక్ట్‌'గా చట్టాన్ని ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు

Breaking: తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం.. వీఆర్వో వ్యవస్థ రద్దులో ముందడుగు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 07, 2020 | 11:31 AM

Share

Telangana Revenue act: తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం తయారైంది. ‘ల్యాండ్  మేనేజ్​మెంట్​ అండ్​ అడ్మినిస్ట్రేషన్​ యాక్ట్‌’గా చట్టాన్ని ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీని వలన వీఆర్వో వ్యవస్థను తొలిగించే ఆలోచనలో ఉన్న సర్కార్‌.. మరో ముందడుగు వేసింది.  వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులు స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రం 3 గంటల లోపు రికార్డులు స్వాధీనం చేసుకుని.. 5 గంటల కల్లా రిపోర్ట్‌లు పంపాలని ఆయన కలెక్టర్లకు ఆదేశించారు. అలాగే వీఆర్వోలను వేరే శాఖల్లోకి బదిలీచేయాలని ఆలోచిస్తోంది.

అయితే తెలంగాణలోని ప్రభుత్వ శాఖల్లో ఎక్కువగా రెవెన్యూ శాఖలో అవినీతి జరుగుతున్నట్లు పేరుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఈ శాఖకు పలుమార్లు సీఎం కేసీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. రెవెన్యూ శాఖలో పనిచేస్తోన్న కిందిస్థాయి ఉద్యోగుల్లో పేరుకుపోయిన అవినీతి ఆ వ్యవస్థకే ప్రమాదమని సీఎం కేసీఆర్ గతేడాది శాసనసభ సాక్షిగా బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో రెవెన్యూ వ్యవస్థ బాగుపడాలంటే గ్రామ వ్యవస్థ రద్దు ఒకటే మార్గమని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో కేసీఆర్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు సిద్ధమైంది.

Read More:

ఇకపై పెట్రోల్‌ బంకుల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్‌లు

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,802 కొత్త కేసులు.. 9 మరణాలు