కరీంనగర్‌లో టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతకు కరోనా.. ఆందోళనలో పలువురు

కరీంనగర్ కార్పొరేషన్‌లో కరోనా కలకలం రేపింది. తాజాగా కరీంనగర్‌ డిప్యూటీ మేయర్ భర్త, టీఆర్‌ఎస్‌ ముఖ్య నేత చల్లా హరి శంకర్‌కి కరోనా సోకింది.

కరీంనగర్‌లో టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతకు కరోనా.. ఆందోళనలో పలువురు

Updated on: Jun 28, 2020 | 7:40 PM

కరీంనగర్ కార్పొరేషన్‌లో కరోనా కలకలం రేపింది. తాజాగా కరీంనగర్‌ డిప్యూటీ మేయర్ భర్త, టీఆర్‌ఎస్‌ ముఖ్య నేత చల్లా హరి శంకర్‌కి కరోనా సోకింది. అయితే చల్లా హరిశంకర్‌ నిన్నటివరకు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనగా.. టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, కార్పొరేషన్‌ సిబ్బందిలో ఆందోళనలో పెరిగింది. విషయం తెలుసుకున్న అధికారులు ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తించే పనిలో పడ్డారు. మరోవైపు చల్లాకు కరోనా పాజిటివ్‌ రావడంతో పలు ప్రాంతాలను అధికారులు కంటైన్‌మెంట్‌గా విధించారు. కాగా తెలంగాణలో నమోదైన  కరోనా కేసుల సంఖ్య 13వేలను దాటేసింది. 243 మంది మరణించగా.. 4,928 మంది కోలుకున్నారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us