Maha Visakhapatnam : సాగర నగర వాసులకు ముఖ్య గమనిక : రేపు(ఆదివారం) నో నాన్-వెజ్ బిజినెస్.!

Visakhapatnam : సాగరనగరం మహా విశాఖపట్నం వాసులకు రేపు నో నాన్ వెజ్. ఈ మేరకు నగర కమిషనర్ తరఫున..

Maha Visakhapatnam :  సాగర నగర వాసులకు ముఖ్య గమనిక : రేపు(ఆదివారం) నో నాన్-వెజ్ బిజినెస్.!
Chicken

Updated on: May 22, 2021 | 9:10 PM

Visakhapatnam : సాగరనగరం మహా విశాఖపట్నం వాసులకు రేపు నో నాన్ వెజ్. ఈ మేరకు నగర కమిషనర్ తరఫున మహా విశాఖ నగర పాలక సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన సారాంశం ఏంటంటే.. “మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో కరోనా కేసులు కట్టడి చేసేందుకు అనేక చర్యలు తీసుకొనబడుచున్నవి. ప్రభుత్వం కర్ఫ్యూ, ఇంకా 144 సెక్షన్ విధించినప్పటికీ ప్రజలు గుంపులు గుంపులుగా షాపుల వద్ద చేరుతున్నారు. ముఖ్యంగా మాంసాహారం, చేపలు, రొయ్యలు తదితర మాంసాహారం అమ్మే షాపులు వద్ద ప్రజలు తాకిడి ఎక్కువగా ఉన్న దృష్ట్యా నగరంలో రేపు అనగా 23-05-2021 ఆదివారం మాంసాహారం అమ్ముట నిషేధించడమైనది. కావున ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరడమైనది. అదీ విషయం.

Visakhapatnam

Read also : Villagers reaction on Anandayya corona medicine : ఆనందయ్య కరోనా మందుపై కృష్ణపట్నం వాసులు ఏమంటున్నారంటే.. !