Avanthi Srinivas : జీవీఎంసీ ఎన్నికల వేళ వైసీపీలో పెద్ద చర్చకే దారితీస్తోన్న మంత్రి అవంతి అలక, విజయసాయిరెడ్డి పనులపైనే కంటగింపు.!

|

Mar 03, 2021 | 2:59 PM

Avanthi Srinivas : గ్రేటర్‌ విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికల వేళ అధికార వైసీపీలో మంత్రి అవంతి అలక పెద్ద చర్చకే దారితీస్తోంది. గంటాకు ప్రధాన అనుచరుడిగా ఉన్న కాశీ విశ్వనాధాన్ని పార్టీలోకి చేర్చుకోవడం ..

Avanthi Srinivas : జీవీఎంసీ ఎన్నికల వేళ వైసీపీలో పెద్ద చర్చకే దారితీస్తోన్న మంత్రి అవంతి అలక, విజయసాయిరెడ్డి పనులపైనే కంటగింపు.!
Avanti Srinivas
Follow us on

Avanthi Srinivas : గ్రేటర్‌ విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికల వేళ అధికార వైసీపీలో మంత్రి అవంతి అలక పెద్ద చర్చకే దారితీస్తోంది. గంటాకు ప్రధాన అనుచరుడిగా ఉన్న కాశీ విశ్వనాధాన్ని పార్టీలోకి చేర్చుకోవడం అవంతికి ఇష్టం లేదని తెలుస్తోంది. దీనిపై పార్టీ పెద్దల దగ్గర చర్చ కూడా జరిగినట్లు తెలుస్తోంది. గంటాకు, అవంతికి ఈ మధ్య కాలంలో చాలా గ్యాప్‌ వచ్చింది. ఆ నేపథ్యంలోనే గంటాకు ప్రధాన అనుచరుడిగా ఉన్న కాశీ విశ్వానాధాన్ని చేర్చుకోవద్దనే అవంతి అభిప్రాయం. కానీ… విజయసాయిరెడ్డి ఏకంగా కాశీకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడంపై అవంతి అలకబూనారు. ఈ కార్యక్రమానికి కూడా రాలేదు. మరోవైపు మంత్రి అవంతితో తనకు వ్యక్తిగత అభిప్రాయాలు ఏమీ లేవన్నారు కాశీ విశ్వనాధం. ఆయన్ను కలిసి మాట్లాడతానని చెప్పారు.

Read also : AP Municipal elections : ఎస్ఈసీ నిమ్మగడ్డకు మరో ఎదురుదెబ్బ, ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వొద్దని ఆదేశించిన హైకోర్టు