అత్తింటి వేధింపులు తాళలేక ఉరివేసుకుని వివాహిత మృతి..
అత్తింటి వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన హైదరాబాద్ నగరం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
అత్తింటి వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన హైదరాబాద్ నగరం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మృతురాలి తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు ..
యూసూఫ్గూడకు చెందిన యువతికి, ఎమ్ఎస్ మక్తాకు చెందిన యువకుడికి 2017లో వివాహం జరిగింది. పెళ్లైన కొద్దీ రోజులు వారి కాపురం సాఫిగానే సాగింది. కానీ, అంతలోనే వారింట్లో కలహాలు మొదలయ్యాయి. చిన్న చిన్న విషయాలకే ఆమెను దూషించటం, వేధింపులకు గురిచేయటం చేస్తుండే వారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ క్రమంలోనే ఈ నెల 19న రాత్రి వేళ తమ ఇంటికి ఫోన్ చేసి మీ కూతురు ఇంట్లో ఉరివేసుకుందని, కిందకు దింపి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లుగా చెప్పారు. కానీ, అప్పటికే ఆమె చనిపోయిందని చెప్పినట్లుగా ఆ తల్లిదండ్రులు పోలీసులకు వివరించారు. తమ కూతురు ఆత్మహత్యకు ఆమె భర్త, కుటుంబ సభ్యుల వేధింపులే కారణమని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.