‘రాజముద్ర’ను మార్చేసిన ఏపీ సీఎంవో.. కారణం అదేనా?

| Edited By:

Apr 16, 2020 | 10:34 AM

ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాంప్ ఆఫీసులో ఓ కీలక మార్పు చోటు చేసుకుంది. అధికారులతో సమీక్షలు నిర్వహించే మీటింగ్ హాల్‌లో సీఎం కూర్చునే స్థానం వెనుక భాగంలో ఉండే బౌద్ధ ధర్మచక్ర స్థానంలో.. రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని..

రాజముద్రను మార్చేసిన ఏపీ సీఎంవో.. కారణం అదేనా?
Follow us on

ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాంప్ ఆఫీసులో ఓ కీలక మార్పు చోటు చేసుకుంది. అధికారులతో సమీక్షలు నిర్వహించే మీటింగ్ హాల్‌లో సీఎం కూర్చునే స్థానం వెనుక భాగంలో ఉండే బౌద్ధ ధర్మచక్ర స్థానంలో.. రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని ఏర్పాటు చేసింది ఏపీ సీఎంవో. చక్రం వెనుక భాగంలో ఉండటం వల్ల అనవసర సమస్యలు ఉంటాయనే కారణంతోనే.. తీసేశారని ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. కాగా ఏపీ సీఎంవో మంగళవారం షేర్ చేసిన ఫొటోల్లో జగన్ బ్యాక్ గ్రౌండ్‌లో చక్రం ఉండగా.. బుధవారం నాటి సమీక్షలో షేర్ చేసిన ఫొటోల్లో మాత్రం అది కనిపించలేదు.

కాగా.. ఏపీ రాజధాని అమరావతికి చిహ్నంగా మాజీ సీఎం చంద్రబాబు ఆ బౌద్ధ ధర్మచక్రాన్ని ఎంతో ఇష్టపడి ఏర్పాటు చేయించారు. ఇన్నాళ్లపాటు అది అలాగే ఉన్నా.. సడన్‌గా ఎందుకు మార్చేశారా? అని టీడీపీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. వైసీపీ శ్రేణులు మాత్రం.. జగన్ మంచి పని చేశారని కితాబిస్తున్నారు.