AP Government Sand Issues: ఇసుకకు సంబంధించి జగన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంటోంది. ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకున్న తరువాత.. నాణ్యమైనది సరఫరా అవ్వకపోతే దాన్ని వెనక్కి పంపే అవకాశాన్ని కొనుగోలుదారులకు ఇవ్వనున్నారు. అలాగే మళ్లీ వారికి నాణ్యమైన ఇసుక అందేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు ఏపీఎండీసీ ప్రతిపాదన సిద్ధం చేస్తుండగా.. దీనిపై ఏపీ ప్రభుత్వం త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది.
కాగా ఇంటికి డెలివరీ చేసిన ఇసుక నాణ్యత లేదని, మట్టితో వస్తోందని పలువురి నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. ఈ ఇసుక నిర్మాణాలకు ఉపయోగపడం లేదంటూ.. చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పినిపే విశ్వరూప్కి సైతం ఇలాంటి ఇబ్బందులే ఎదురయ్యాయి. దీంతో ఈ వ్యవహారంపై ఆయన కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. ఇక మరోవైపు కొన్ని నెలల కిందట జరిగిన ఇసుక తవ్వకాల లెక్కల్లో తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ రిపోర్ట్ను ఏపీఎండీసీకి అందజేశారు. ఈ లెక్కలపై మరోసారి డ్రోన్ ద్వారా సర్వే చేయించాలని ఏపీఎండీసీ నిర్ణయించింది.
Read This Story Also: Breaking: ‘హనుమాన్ జంక్షన్’ నటి విజయలక్ష్మి ఆత్మహత్యాయత్నం