Smuggling: విశాఖలో రెచ్చిపోయిన స్మగ్లర్లు.. అక్రమంగా గంధపు చెక్కల తరలింపు.. పట్టుకున్న పోలీసులు..

|

Dec 28, 2020 | 5:24 PM

విశాఖపట్నంలో స్మగ్లర్లు ఝలక్ ఇచ్చారు పోలీసులు. గుట్టు చప్పుడుకాకుండా తరలిస్తున్న గంధపు చెక్కలను పట్టుకున్నారు.

Smuggling: విశాఖలో రెచ్చిపోయిన స్మగ్లర్లు.. అక్రమంగా గంధపు చెక్కల తరలింపు.. పట్టుకున్న పోలీసులు..
Follow us on

Smuggling: విశాఖపట్నంలో స్మగ్లర్లు ఝలక్ ఇచ్చారు పోలీసులు. గుట్టు చప్పుడుకాకుండా తరలిస్తున్న గంధపు చెక్కలను పట్టుకున్నారు. రోజూవారి తనిఖీల్లో భాగంగా పోలీసులు నేడు చోడవరంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఇంతలో ఓ ఫోర్డ్ కారు వచ్చింది. అందులోని మనుషులు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు వారి కారును తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 108 కేజీల బరువైన గంధపు చెక్కలు పట్టుబడ్డాయి. పోలీసులు ఆ గంధం చెక్కలను స్వాధీనం చేసుకుని, వారు ప్రయాణిస్తున్న కారును సీజ్ చేశారు. గంధపు చెక్కలను స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, విశాఖ ఏజెన్సీ నుండి హైదరాబాద్‌కు ఈ గంధపు చెక్కలను తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ స్మగ్లింగ్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Also read:

2021 మానవాళికి గడ్డుకాలమేనా?.. మరిన్ని విపత్తులు తప్పవా?.. బాబా వాంగ చెప్పింది నిజమవుతుందా?..

2020 రౌండప్: క్రికెట్‌కు అచ్చిరాని సంవత్సరం.. కానీ పలు వివాదాలకు కేరాఫ్ అడ్రెస్.. అవేంటంటే..!