విశాఖపట్నం హెచ్పీసీఎల్ విస్తరణ పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. నిర్మాణపనులు జరుగుతుండగా మట్టిపెళ్లలు పడి ముగ్గురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ఝార్ఖండ్కు చెందిన ఇద్దరి వ్యక్తులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.