Watch Video: శ్రీవారి సన్నిదిలో పట్టపగలు ఇదేం అపచారం.. ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు!
Tirupati temple board fires 2 employees for eating non-veg food on sacred pathway: టీటీడీలో పనిచేస్తున్న సిబ్బందే నియమాలను విస్మరించారు. ఏం చేయాలో ఏం చేయకూడదు తెలిసి కూడా నిబంధనను అతిక్రమించారు. అలిపిరి వద్ద మాంసాహారం తింటూ భక్తుల కంటపడ్డారు. నడక మార్గంలో టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగులు మాంసాహారం తినడాన్ని గుర్తించిన భక్తులు..

తిరుపతి, నవంబర్ 10: టీటీడీలో పనిచేస్తున్న సిబ్బందే నియమాలను విస్మరించారు. ఏం చేయాలో ఏం చేయకూడదు తెలిసి కూడా నిబంధనను అతిక్రమించారు. అలిపిరి వద్ద మాంసాహారం తింటూ భక్తుల కంటపడ్డారు. నడక మార్గంలో టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగులు మాంసాహారం తినడాన్ని గుర్తించిన భక్తులు నిలదీయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తిరుపతి సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేయడంతో అందరికీ తెలిసిపోయింది. ఈ వ్యవహారం కాస్తా టిటిడి యాజమాన్యం దృష్టికి వెళ్ళింది. స్పందించిన టీటీడీ ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై వేటు వేసింది.
రామస్వామి, నరసమ్మ అనే టిటిడి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నిన్న అలిపిరి వద్ద మాంసాహారం తిన్నట్లు గుర్తించింది. ఇద్దరి పైనా తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇద్దరు ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు టీటీడీ అధికారిక ప్రకటన జారీ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు నెట్టింట వైరల్గా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




