
వాళ్ళది నిరుపేద కుటుంబం.. కొడుకులే వారికి జీవనధారం.. చేతికి అంది వచ్చిన కొడుకులను చూస్తూ మురిసిపోతున్నారు. ఇక తమ కష్టాలు గట్టెక్కినట్టే అని భావిస్తున్న వేళ.. అనుకోని ఆపద నా కుటుంబానికి విషాదంలోకి నెట్టేసింది. రోడ్డు ప్రమాదంలో ఓ కొడుకు ఆసుపత్రి పాలయ్యాడు. వైద్యానికి రెస్పాండ్ కాకపోవడంతో.. బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించారు. తీవ్ర విషయంలోకి వెళ్లిపోయారు పేరెంట్స్. వైద్యాధికారులు కౌన్సిలింగ్ చేయడంతో.. ఆ తల్లిదండ్రులు గొప్ప మనసు చాటుకున్నారు. అంతటి విషాదంలోనూ ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు.
అనకాపల్లి జిల్లా మునగపాక మండలం నాగులపల్లి గ్రామంలో ఆ తల్లిదండ్రులు ఆదర్శంగా నిలిచారు. అచ్చిం నాయుడు, వెంకటలక్ష్మి దంపతులకు ఇద్దరు మగపిల్లలు. ఒకరు లోకేష్, మరొకడు చిన్న రావు. ఇద్దరూ ఐటీఐ చేశారు.. ఎలక్ట్రీషియన్ శిక్షణ పొందారు. ఎలక్ట్రిషన్ పనులు చేసుకుంటూ ఇద్దరు కొడుకులు తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలుస్తూ ఉన్నారు. ఆ పేద పేరెంట్స్ ఆ కొడుకులను చూసి మురిసిపోయేవారు. ఇంతలో విధి ఆ పేద కుటుంబంపై చిన్న చూపు చూసింది. ఈనెల 11న విధి నిర్వహణలో భాగంగా విశాఖ వెళ్లిన చిన్నారావు తిరుగు ప్రయాణమయ్యాడు. ఆ సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.
పరవాడ హైవేపై మూడు కలవర్టుల జంక్షన్ వద్ద కుక్కను తప్పించబోయి బైక్తో డివైడర్ను ఢీకొట్టాడు. ఈ సమయంలో.. తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ ట్రీట్మెంట్ చేసిన వైద్యులు బ్రెయిన్ డెడ్గా నిర్ధారించారు. దీంతో ఆ కుటుంబం తీరని విషాదంలోకి వెళ్లిపోయింది. వైద్యాధికారులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో.. తన కొడుకు మరికొందరికి ప్రాణదాతగా నిలవాలని భావించారు ఆ పేరెంట్స్. గుండెలో సముద్రమంత శోకం ఉన్నప్పటికీ.. గొప్ప మనసు చాటే ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు. తమ కుమారుడి గుండె, కిడ్నీ, కాలేయం దానం చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో ఆ పేరెంట్స్ కు అందరూ సలాం చేస్తున్నారు.