నెల రోజుల్లోనే రూ.3 కోట్ల ఆదాయం.. చిత్తూరు రైతు విజయ రహస్యం ఏమిటంటే..?

|

Jul 25, 2023 | 12:51 PM

Chittoor District News: ప్రస్తుతం టమాటా పంట రైతులకు సిరులపంటగా మారింది. టమాటా తోట ఉన్నవారు ఉన్నపాటుగా కోటేశ్వరులైపోతున్నారు. మెదక్ జిల్లాలో మహిపాల్ రెడ్డి ఇప్పటికే రూ.2 కోట్ల టమాటాలను విక్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో రైతు ఏకంగా రూ.3 కోట్ల ఆదాయం..

నెల రోజుల్లోనే రూ.3 కోట్ల ఆదాయం.. చిత్తూరు రైతు విజయ రహస్యం ఏమిటంటే..?
Chandramouli
Follow us on

చిత్తూర్ జిల్లా, జూలై 25: ప్రస్తుతం టమాటా పంట రైతులకు సిరులపంటగా మారింది. టమాటా తోట ఉన్నవారు ఉన్నపాటుగా కోటేశ్వరులైపోతున్నారు. మెదక్ జిల్లాలో మహిపాల్ రెడ్డి ఇప్పటికే రూ.2 కోట్ల విలువ చేసే టమాటాలను విక్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో రైతు నెల రోజుల్లోనే ఏకంగా రూ.3 కోట్ల ఆదాయం గడించాడు. చిత్తూరు జిల్లాకు చెందిన సోమల మండలం కరకమందకు చెందిన చంద్రమౌళి తన తమ్ముడు మురళి, తల్లి రాజమ్మతో కలిసి ఉమ్మడిగా వ్యవసాయం చేస్తున్నాడు. సొంతూరు కరకమందలో 12 ఎకరాలు, పులిచెర్ల మండలం సువ్వారపుపల్లెలో 20 ఎకరాల పొలం కలిగిన చంద్రమౌళి కుటుంబం ఏళ్ల నుంచి టమాటా సాగును పండిస్తోంది. ఈ క్రమంలోనే చంద్రమౌళి ఈ సారి కూడా తమ పొలంలో అదే పండను వేశారు.

అంతే.. మార్కెట్‌లో కేజీ టమాట ధర రూ.150 నుంచి రూ.180 వరకు ఉండడంతో చంద్రమౌళి చేసిన 22 ఏకరాల టమాటా సాగు బంగారు పంటగా మారింది. జూన్, జూలై నాటికి పంట చేతికి వచ్చేలా సాగు చేయడం కలిసి వచ్చిందని చంద్రమౌళి చెబుతున్నారు. కట్టెసాగు విధానంలో మల్చింగ్‌, సూక్ష్మ సేద్య పద్ధతులు పాటించామని.. జూన్‌ చివరిలో దిగుబడి మొదలవ్వగా కర్ణాటకలోని కోలార్‌ మార్కెట్‌లో విక్రయించామని చంద్రమౌళి తెలిపారు. మార్కెట్‌లో 15 కిలోల టమాట బాక్స్ ధర రూ.వెయ్యి నుంచి రూ.1500 మధ్య పలికింది. ఈ క్రమంలో 40 వేల పెట్టెలను చంద్రమౌళి విక్రయించగా రూ. 4 కోట్లు ఆదాయం వచ్చిందని.. 22 ఎకరాలకు పెట్టుబడి రూపంలో రూ.70 లక్షలు కాగా, కమీషన్‌గా 20 లక్షలు, రవాణా ఖర్చులు 10 లక్షలు అయినట్లు తెలిపారు.మొత్తం ఖర్చులు పోగా చేతికి రూ.3 కోట్ల ఆదాయం వచ్చిందని చంద్రమౌళి అన్నారు.

ఇవి కూడా చదవండి

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..