Navaratri Celebrations: సెప్టెంబర్‌ 26 నుంచి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు

Navaratri Celebrations: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 26 నుంచి అక్టోబ‌రు 5వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి..

Navaratri Celebrations: సెప్టెంబర్‌ 26 నుంచి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు
Navratri Celebrations

Updated on: Sep 17, 2022 | 5:10 AM

Navaratri Celebrations: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 26 నుంచి అక్టోబ‌రు 5వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, ఇతర పండ్ల రసాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అదేవిధంగా సాయంత్రం ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. అక్టోబరు 5వ తేదీ విజయదశమి నాడు శ్రీపద్మావతి అమ్మవారు విశేషమైన గజ వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

న‌వ‌రాత్రి ఉత్సవాల కార‌ణంగా ఈ 10 రోజుల పాటు క‌ల్యాణోత్సవం, స‌హ‌స్రదీపాలంకార సేవల‌ను ర‌ద్దు చేశారు. అదేవిధంగా, సెప్టెంబ‌రు 30న ల‌క్ష్మీపూజ‌, అక్టోబరు 5న అష్టోత్తర శ‌త క‌లశాభిషేకం సేవ‌లు రద్దయ్యాయని టీటీడీ తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి