AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rains effect: తిరుమల ఘాట రోడ్ల మూసివేత.. బస్సులు కూడా బంద్‌.. ఎప్పటివరకంటే..

ఈశాన్య రుతుపవనాలకు తోడు పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి

Rains effect: తిరుమల ఘాట రోడ్ల మూసివేత.. బస్సులు కూడా బంద్‌.. ఎప్పటివరకంటే..
Basha Shek
|

Updated on: Nov 11, 2021 | 8:20 PM

Share

ఈశాన్య రుతుపవనాలకు తోడు పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇక తమిళనాడు సరిహద్దు జిల్లా అయిన చిత్తూరులో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇక తిరుపతి, తిరుమల క్షేత్రాల్లో గురువారం ఉదయం నుంచి కుండపోత వర్షం పడుతోంది. ఈ నేపథ్యంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్తగా తిరుపతి- తిరుమల కనుమ రహదారులను మూసివేస్తు్న్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.

పరిస్థితులు అనుకూలించిన తర్వాతే.. ఎడతెరిపి లేని వర్షాలతో తిరుమల కనుమ రహదారుల్లో కొండ చరియలు, చెట్లు విరిగిపడుతున్నాయి. కనుమ రహదారుల్లో చాలా చోట్ల ఇప్పటికే కొండ చరియలు విరిగిపడడంతో జేసీబీల సహాయంతో తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో భక్తుల రాకపోకలు అంత సురక్షితం కాదని టీటీడీ భావించింది. అందుకే నేటి (గురువారం) రాత్రి నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు తిరుమల ఘాట్‌ రోడ్లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఆర్టీసీ బస్సులను కూడా నిలిపివేస్తున్నట్లు కూడా ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా రాత్రి 7.30 గంటల నుంచే బస్‌ టికెట్ల జారీని ఆపేశారు. పరిస్థితులు పూర్తిగా అనుకూలించిన తర్వాతే బస్సులను పునరుద్ధరిస్తామన్నారు.