Chandrababu Naidu: కేసీఆర్‌ ‘భారత్ రాష్ట్ర సమితి’ పార్టీపై చంద్రబాబు రియాక్షన్ ఇదే..

దుర్గమ్మ తల్లి సాక్షిగా రాజధాని ఇక్కడే ఉండాలని.. అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించాయని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. రాజకీయ నాయకులు రోజుకోమాట చెప్పడం సరికాదన్నారు.

Chandrababu Naidu: కేసీఆర్‌ ‘భారత్ రాష్ట్ర సమితి’ పార్టీపై చంద్రబాబు రియాక్షన్ ఇదే..
Chandrababu

Updated on: Oct 05, 2022 | 4:39 PM

దుర్గమ్మ తల్లి సాక్షిగా రాజధాని ఇక్కడే ఉండాలని.. అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించాయని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. రాజకీయ నాయకులు రోజుకోమాట చెప్పడం సరికాదన్నారు. విజయ దశమి సందర్భంగా చంద్రబాబు దంపతులు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని చల్లగా చూడాలని అమ్మవారిని కోరినట్లు చెప్పారు. తాము అధికారంలో ఉన్నప్పుడు 150 కోట్ల రూపాయలతో ఇంద్రకీలాద్రిపై అనేక వసతులు కల్పించినట్లు చంద్రబాబు చెప్పారు.

రాజధాని అమరావతిపై రోజుకోమాట చెప్పడం వైసీపీకి తగదని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి.. రాష్ట్ర ప్రజల సంకల్పం, దేవతల ఆశీర్వాదమంటూ వివరించారు. కాగా.. ఇంద్రకీలాద్రికి వచ్చిన చంద్రబాబు దంపతులకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం పలికారు. తొలుత ఆలయ అధికారులు వారికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.

కేసీఆర్‌ జాతీయ పార్టీ BRS పై TDP నేత చంద్రబాబు తనదైన శైలిలో స్పందించారు. దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించడానికి ఇంద్రకీలాద్రికి వచ్చిన సందర్భంలో మీడియా ప్రతినిధులు ఆయన్న కేసీఆర్ జాతీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి గురించి స్పందనేంటని అడిగారు. దానికి ఆయన.. ఓ నవ్వు నవ్వి అక్కడ నుంచి వెళ్లిపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us