తిరుమల వెంకన్నను టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్ర శేఖరన్ దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి సేవలో పాల్గొనేందుకు నిన్న రాత్రి తిరుమల చేరుకున్న టాటా గ్రూప్ చైర్మన్ శ్రీ పద్మావతి అతిథి గృహంలో బస చేశారు. ఆయనను టీటీడీ ఈవో శ్యామలరావు మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు. టాటా గ్రూప్ చైర్మన్ వెంట టిసిఎస్ ప్రెసిడెంట్ రాజన్న కూడా ఉన్నారు. జూలై 5న శుక్రవారం తెల్లవారుజామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. అనంతరం శ్రీవారి ప్రత్యేక దర్శనాన్ని చేసుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్కు పండితులు వేద ఆశీర్వచనం అందచేశారు. అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు ఆలయ అధికారులు. ఈవో శ్యామలరావు శ్రీవారి శేషవస్త్రంతో సన్మానించి స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు.
#WATCH | Tirupati, Andhra Pradesh: Tata Group Chairman N Chandrasekaran visited and offered prayers at Tirupati Balaji temple. pic.twitter.com/ZuEVcDDpAj
— ANI (@ANI) July 5, 2024
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..