అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మినీ వ్యాన్, లారీ ఢీ.. ఆరుగురు స్పాట్‌డెడ్‌..

|

Nov 22, 2022 | 5:42 PM

వాహనంలో ఉన్నవారంతా భద్రాచలం శ్రీరామచంద్రస్వామని దర్శించుకొని చత్తీస్ ఘడ్‌కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలిసింది.

అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మినీ వ్యాన్, లారీ ఢీ.. ఆరుగురు స్పాట్‌డెడ్‌..
Road Accident
Follow us on

అల్లూరి జిల్లాలోని చింతూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని చింతూరు మండలం, బొడ్డుగూడెం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. వ్యాన్, లారీ ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సాయంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హుటాహుటినా ఆస్పత్రిలో చేర్చి చికిత్సనందించారు. వాహనంలో ఉన్నవారంతా భద్రాచలం శ్రీరామచంద్రస్వామని దర్శించుకొని చత్తీస్ ఘడ్‌కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలిసింది. వ్యాన్ డ్రైవర్ అతివేగంగా వాహనాన్ని నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

బాధితులు ప్రయాణిస్తున్న వాహనంలో ఉన్న మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులు ఛత్తీస్‌గఢ్‌ వాసులుగా గుర్తించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని భావిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి