
ఇప్పటి వరకు అందరూ మాట్లాడారు. ఎవరి స్టేట్మెంట్ వాళ్లిచ్చారు. ఎవరెన్ని చెప్పినా.. ఏదో మిస్ అవుతున్నట్టుంది కదా..! సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పే దాకా రాయలసీమ ప్రాజెక్ట్ ఊసే వినిపించలేదు. తాను మొదలుపెట్టిన ప్రాజెక్ట్ను ఎందుకు పూర్తిచేయట్లేదని ఈ 19 నెలల్లో వైఎస్ జగన్ ఒక్కసారి కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇక్కడో డౌట్ ఏంటంటే.. ‘తానే ఆపించాను’ అనేంత వరకు ఆ ఎత్తిపోతల పనులు జరుగుతున్నట్టేగా లెక్క. జరగని పనులను చూపించి ఆపించాను అనాల్సిన అవసరం లేదు కదా. మరి.. 2020లోనే పనులు ఆగిపోయాయ్ అని ఏపీ ప్రభుత్వం ఎందుకంది? దాదాపు ఐదేళ్ల క్రితమే ప్రాజెక్ట్ ఆగింది నిజమైతే.. సీఎం రేవంత్ నుంచి ఆ స్టేట్మెంట్ ఎందుకొచ్చింది? బీఆర్ఎస్ కూడా తాము ఉన్నప్పుడే ప్రాజెక్టును ఆపించామని చెప్పింది. అసలైన విషయం ఇంకోటుంది. తీర్పును ఉల్లంఘించినందుకు 2 కోట్ల 65 లక్షల రూపాయల జరిమానా విధించింది NGT. ఎప్పుడొచ్చిందా నోటీస్? 2024లో. ఏంటి దానర్ధం? అప్పటిదాకా పనులు జరుగుతున్నట్టే అనుకోవాలా? ఎవరి వర్షన్ వాళ్లదే. మరొక్కసారి మొదటి నుంచీ వద్దాం. క్రెడిట్ తాను తీసుకోకూడదని చెప్పి ఇన్నాళ్లూ ఈ విషయం దాచి పెట్టా.. ఇక చెప్పక తప్పని పరిస్థితి వచ్చిందని బ్లాస్టింగ్ న్యూస్ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. నీళ్ల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఆపేందుకు ఒక అడుగు ముందుకేసి తానే సీఎం చంద్రబాబుతో మాట్లాడానన్నారు. అసలు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు...