బనకచర్ల ప్రాజెక్ట్‌పై కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక సమావేశం! పూర్తి వివరాలు..

కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఇవాళ పోలవరం-బనకచర్ల రివర్ లింక్ ప్రాజెక్ట్ డీపీఆర్ పై చర్చించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. రూ.81,000 కోట్లతో నిర్మించాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తోంది. ఈ సమావేశంలో ఏపీ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తారు.

బనకచర్ల ప్రాజెక్ట్‌పై కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక సమావేశం! పూర్తి వివరాలు..
Banakacherla Project

Updated on: Jun 02, 2025 | 1:44 PM

ఇవాళ(సోమవారం, జూన్‌ 2) కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. పోలవరం-బనకచర్ల రివర్ లింక్ ప్రాజెక్ట్‌ డీపీఆర్‌(డిటేయిల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌)పై చర్చిస్తారు. రూ.81 వేల కోట్లతో ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడానికి ఏపీ ప్రయత్నం ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రాజెక్ట్‌తో కలిగి ప్రయోజనాలు వివరిస్తూ డీపీఆర్ రూపొందించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఈ సమావేశంలో ఏపీ ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ పీయూష్, జలవనరులశాఖ సహాలదారు వెంకటేశ్వరరావు, పోలవరం చీఫ్‌ ఇంజినీర్ నరసింహమూర్తి పాల్గొంటారు.

అయితే బనకచర్ల ప్రాజెక్ట్‌ను తెలంగాణ వ్యతిరేకిస్తోంది. నిన్నటి సమావేశంలో ఈ అంశాన్ని తెలంగాణ సీఎం రేవంత్‌ ప్రత్యేకంగా ప్రస్తావించారు కూడా. మరోవైపు సముద్రంలోకి వెళ్లే జలాలు మాత్రమే వినియోగించుకుని జనకచర్ల రూపొందించామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఇందులో తెలంగాణకు అభ్యంతరమేంటని ఏపీ సీఎం చంద్రబాబు సైతం ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ భేటీపై ఆసక్తి నెలకొన్నది. మరి దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ ఎలాంటి స్పందన ఇస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us