Vijayawada Pink Toilet: బెంజ్ సర్కిల్​లో మహిళల కోసం పింక్ టాయిలెట్.. బాలింతలకు ప్రత్యేక ఏర్పాట్లు..

| Edited By: Jyothi Gadda

Nov 18, 2023 | 12:58 PM

Vijayawada: ఇక బెంజీ సర్కిల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. సిటీ సెంటర్ లొ ఉన్న ఈ ప్రదేశంలో నిత్యం లక్షల మంది ప్రయాణం చేస్తుంటారు. అలాంటి ప్రదేశం లో ఈ పింక్ టాయిలెట్స్ ను ఏర్పాటు చెయ్యటం చాలామందికి ఉపయోగకారంగా ఉంటుంది...సాధారణంగా అయితే ప్రతి 120 మీటర్ల కు  ఒక మరుగు టాయిలెట్ ఉండాలి.. కానీ, ఇది ఇప్పట్లో జరిగే పని కాదు.. కాబట్టి కనీసం రద్దీగా ఉండే ప్రదేశాల్లో అయిన ఇలాంటి వెసులుబాటు కల్పిస్తే పూర్తీ స్థాయిలో కాకపోయినా కొంతమేర సమ్యకు పరిష్కారం లభించినట్లే అవుతోందంటున్నారు స్థానిక ప్రజలు. 

Vijayawada Pink Toilet: బెంజ్ సర్కిల్​లో మహిళల కోసం పింక్ టాయిలెట్.. బాలింతలకు ప్రత్యేక ఏర్పాట్లు..
Vijayawada Pink Toilet
Follow us on

విజయవా, నవంబర్18; మహిళల కోసం ప్రత్యేకమైన పింక్ టాయిలెట్లు అందుబాటులోకి వచ్చేశాయి..నిత్యం రద్దీగా ఉండే విజయవాడలో వందలమంది తమ ప్రయాణాలను కొనసాగిస్తూ ఉంటారు..ప్రయాణ సమయాల్లో సాధారణంగా అందరికీ వచ్చే సమస్య టాయిలెట్ ముఖ్యంగా మహిళలు ఈ సమ్యను ఎక్కువగా ఎదుర్కుంటూ ఉంటారు.. ఆడవారు బయటకు వెళ్ళినప్పుడల్లా ఎదుర్కునే సమయాల్లో ఇది కూడా ఒకటి… రద్దీగా ఉండే ప్రదేశాల్లో పబ్లిక్ వాష్ రూమ్స్ ఉండవు, ఉన్న ఆడవారికి మగవారికి కలిపి ఉంటాయి. వాటి మైంటినెన్స్ కుడా సరిగ్గ ఉండదు ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికి ఇప్పుడూ విజయవాడ బెంజ్ సర్కిల్ లో పింక్ టాయిలెట్లు అందుబాటులోకి వచ్చేశాయి.

ప్రయాణాలు చేసే మహిళలే కాదు ఉద్యోగస్తులు, విద్యార్థులు, పిలల్ల తల్లులు,నెలసరి సమస్యలో ఉన్న మహిళలకు ఈ టాయిలెట్లు బాగా ఉపయోగ పడనున్నాయి….ఇవి కేవలం టాయిలెట్స్ మాత్రమే కాదు.. ఇక్కడ మహిళలకు అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసారు ఈ పింక్ టాయిలెట్ లలో తల్లులు తమ బిడ్డలకు పాలు కుడా ఇవ్వొచ్చు. దానికి ప్రత్యేక ఫీడింగ్ రూమ్ కుడా ఉంటుంది…ఇక శానిటరీ నేప్కిన్స్ కుడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. కేవలం ఐదు రూపాయలు పెడితే మూడు శానిటరీ ప్యాడ్స్ వస్తాయి.

ఇప్పటికీ భారతదేశం లో ఓపెన్ గా ప్యాడ్స్ కొనటానికి ఇబ్బంది పడే మహిళలు చాలా మందే ఉన్నారు..ఒకవేళ కొనేవారికి ప్రయాణసమయాల్లో, ఎమర్జెన్సీ సమయాల్లో అందుబాటులో వుండే అవకాశం కూడా ఉండదు. అలాంటి రద్దీ ప్రదేశాల్లో ఈ పింక్ టాయిలెట్స్ లో ప్యాడ్స్ అందుబాటులో ఉండటం కొంత మేర మహిళలకు ఉపయోగకరంగా ఉంటుంది….అంతే కాకుండా వేడింగ్ మెషీన్,మహిళా ప్రయాణికులు ఫ్రెష్ అయ్యేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు…ఈ మొదటి పింక్ టాయిలెట్ ను బెంజి సర్కిల్ సమీపంలో ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసింది….

ఇవి కూడా చదవండి

ఇక బెంజీ సర్కిల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. సిటీ సెంటర్ లొ ఉన్న ఈ ప్రదేశంలో నిత్యం లక్షల మంది ప్రయాణం చేస్తుంటారు. అలాంటి ప్రదేశం లో ఈ పింక్ టాయిలెట్స్ ను ఏర్పాటు చెయ్యటం చాలామందికి ఉపయోగకారంగా ఉంటుంది…సాధారణంగా అయితే ప్రతి 120 మీటర్ల కు  ఒక మరుగు టాయిలెట్ ఉండాలి.. కానీ, ఇది ఇప్పట్లో జరిగే పని కాదు.. కాబట్టి కనీసం రద్దీగా ఉండే ప్రదేశాల్లో అయిన ఇలాంటి వెసులుబాటు కల్పిస్తే పూర్తీ స్థాయిలో కాకపోయినా కొంతమేర సమ్యకు పరిష్కారం లభించినట్లే అవుతోందంటున్నారు స్థానిక ప్రజలు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి…