Pawan Kalyan: యువత సమస్యలే ఎజెండాగా రణస్థలంలో యువశక్తి బహిరంగ సభ.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పవన్ పిలుపు

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ నెల 12వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో 'యువశక్తి ' పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను పవన్ కల్యాణ్ సోమవారం ఆవిష్కరించారు.

Pawan Kalyan: యువత సమస్యలే ఎజెండాగా రణస్థలంలో యువశక్తి బహిరంగ సభ.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పవన్ పిలుపు
Pawan Kalyan Yuvashakti

Updated on: Jan 02, 2023 | 7:00 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల సమర శంఖారావాన్ని ముందే పూరించినట్లు ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పని తీరుని ప్రశ్నిస్తూ..  జనసేనాని  ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ యువతని ఆకట్టుకునే విధంగా మరో కార్యక్రమంతో ప్రజల ముందుకు రానున్నాడు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ నెల 12వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో ‘యువశక్తి ‘ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను  పవన్ కల్యాణ్ సోమవారం ఆవిష్కరించారు.

ఏపీలోని యువత తమ గళం వినిపించేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని జనసేనాని చెప్పారు. రణస్థలం వేదికగా ఏర్పాటు చేస్తున్న యువశక్తి సభను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో రణస్థలంలో యువశక్తి తమ తడాఖా చూపించబోతోందన్నారు. ఈ సభకు యువతీయువకులు అందరూ ఆహ్వానితులేనని పేర్కొన్నారు.

యువత తమ ఆలోచనల గురించి, వారి కష్టాల గురించి, వారి భవిష్యత్ గురించి గళం వినిపించేలా యువశక్తి కార్యక్రమం ఉండనుందని.. ఈ కార్యక్రమంలో తమ అభిప్రాయాలను యువత వినిపించవచ్చు అని తెలిపారు. మన యువత మన భవిత అని భావించి యువశక్తి సభలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు పవన్ కళ్యాణ్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..