Nagarjuna Sagar By Poll: మరో నాలుగైదు రోజుల్లో తిరుపతి, నాగార్జునసాగర్ బైపోల్ కు నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చిలో ఎన్నికల నిర్వహణకు ఈసీ సన్నాహాలు చేస్తోంది. ఈసీ నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఒక్కసారిగా వేడక్కాయి. ఇకపోతే సాగర్లో కేసీఆర్ టూర్తో తెలంగాణ రాజకీయం మరో మలుపు తీసుకుంది. నాగార్జునసాగర్లో అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీలు కసరత్తును మొదలు పెట్టాయి. కాగా, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇప్పటికే నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. మరోవైపుు బలమైన అభ్యర్థి కోసం బీజేపీ అన్వేషిస్తోంది. అటు ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తిరుపతి వైసీపీ అభ్యర్థి ఎంపికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Also read:
Breaking News: నల్గొండ జిల్లాపై వరాల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్.. రేపు జీవో విడుదల చేస్తామంటూ..
CM KCR Warning: ఒళ్లు దగ్గర పెట్టుకోండి.. బీజేపీ నాయకత్వానికి సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్