
రేపటి వికాసం కోసం స్వర్ణాంధ్ర దిశగా మరో అడుగు అంటూ గత మేనెలలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆవిష్కృతమైంది అమరావతి 2.O. దాదాపు 58వేల కోట్ల రూపాయల విలువైన పనులకు ఒకేసారి శంకుస్థాపన చేశారు. దాంతోనే అమరావతి కొత్త ఊపిరి పోసుకుంది. పోగొట్టుకున్న బ్రాండ్ ఇమేజ్ను కూడా తిరిగి సొంతం చేసుకుంది. దేశమంతా మరోసారి అమరావతి గురించి మాట్లాడుకోవడం మొదలైంది. అన్ని అడ్డంకుల్నీ దాటుకుని, అమరావతి పునఃనిర్మాణాన్ని పట్టాలెక్కించడాన్ని ఛాలెంజ్గా తీసుకుంది కూటమి ప్రభుత్వం. ప్రతీరోజూ 20 వేలమంది కార్మికులు, వందల మంది ఇంజినీర్లు, మెటీరియల్ లోడ్తో వందలకొద్దీ లారీలు, రాజధానిలో జాతరలా మొదలైంది నిర్మాణం. అడపాదడపా వానలొచ్చి, నీళ్లు నిలబడ్డప్పుడు తప్పిస్తే, మిగతా అన్ని రోజుల్లోనూ నాన్స్టాప్గా ఒక మహా యజ్ఞంలా సాగింది అమరావతి నిర్మాణం. ఏడాది పాటు జరిగిన రాజధాని యాగం ఒక స్పష్టమైన ఫలితాన్నైతే ఇచ్చింది. అమరావతి 2.O ఫస్ట్ చాప్టర్, మరికొన్నిగంటల్లో చాలా గ్రాండ్గా ఆవిష్కృతం కాబోతోంది. సీఆర్డీఏ హెడ్క్వార్టర్స్… అల్ట్రా మోడ్రన్ హంగులతో, కార్పొరేట్ తరహాలో 7 అంతస్తుల్లో రూపొందిన అద్భుతమైన నిర్మాణం… గత అక్టోబర్లో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభమైంది. అమరావతి 2.Oలో అందుబాటులోకొచ్చిన మొట్టమొదటి పూర్తిస్థాయి భవనం ఇదే. ఇప్పుడు రెండో అడుగు.. అంతకంటే...