AP Weather: ఏపీ ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..

ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని.. మరికొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆయా ప్రాంతాలకు సంబంధించిన వివరాలు కూడా రిలీజ్ చేసింది. ఆ డీలేట్స్ మీ కోసం.

AP Weather: ఏపీ ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
Lighting Strike

Updated on: May 27, 2023 | 8:44 PM

ఏపీ ప్రజలకు రెయిన్ అలర్ట్ వచ్చింది. ద్రోణి ప్రభావంతో ఆదివారం( మే 28)  అల్లూరి సీతారామరాజు జిల్లా, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పిడుగుపాటు వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షం పడే సమయంలో చెట్ల కింద నిలబడవద్దని.. బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని హెచ్చరించింది. సముద్రం, చెరువులు, కొలనులు, కాలవల వద్ద ఉంటే వెంటనే దూరంగా వెళ్లాలని పేర్కొంది. రేకు, లోహం కలిగిన నిర్మాణాలకు దూరంగా ఉండాలని సూచించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతున్నప్పుడు.. మీ మెడ వెనుక జుట్టు నిక్కబొడుచుకోవడం లేదా చర్మం జలదరింపు ఉంటే… అది మెరుపు లేదా పిడుగు రావడానికి సూచన అని పేర్కొంది ఏపీ విపత్తులు నిర్వహణ సంస్థ.

అటు పలు జిల్లాలకు వాన సూచన చేస్తూనే ఇటు కొన్ని ప్రాంతాల్లో ఎండ అదరగొడుతుంది వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదివారం 73 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.  అల్లూరి జిల్లాలో 3, బాపట్ల 1, తూర్పుగోదావరి 11, ఏలూరు 5, గుంటూరు 15, కాకినాడ 8, కృష్ణా 9, ఎన్టీఆర్ 10, పల్నాడు 5, మన్యం4, వైయస్సార్ జిల్లాలోని 2 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం  క్లిక్ చేయండి..

 

Loading...
Unable to load recommendations.
Follow Us