AP and TS: తెలుగు రాష్ట్రాలపై నైరుతి ప్రభావం.. రానున్న 3 రోజుల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..

|

Jul 11, 2023 | 8:01 AM

కుండపోత వర్షాలతో ఉత్తర భారతం కకావికలమైంది. వరద తాకిడికి నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు 28 ప్రాణాలు విడిచారు. నైరుతి ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉందంటున్నారు వాతావరణశాఖ అధికారులు. రానున్న రెండు మూడు రోజులు భారీ నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ హెచ్చరించారు.

AP and TS: తెలుగు రాష్ట్రాలపై నైరుతి ప్రభావం.. రానున్న 3 రోజుల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..
ఈ రోజు భారీ నుండి అతి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
Follow us on

నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది అమరావతి వాతావరణ కేంద్రం. నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాల్లో విస్తరించిన ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు చెప్పింది వాతావరణ శాఖ. దీంతో ఏపీ యానాం, ఉత్తరకోస్తాలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఈ నెల 12, 13 తేదీల్లో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ చెప్పారు.

తెలంగాణలో రానున్న మూడు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది హైదరాబాద్‌ వాతావరణ శాఖ. ఈ రోజు నుంచి రానున్న మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో రేపు, ఎల్లుండి జాగ్రత్తగా ఉండాలని.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఇక హైదరాబాద్ నగరంలో రాత్రి పూట తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని చెప్పింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..