AP Rain Alert: ఇక దంచుడే.. ఏపీలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్..!
Andhra Pradesh Weather Alert: ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం నుంచి మధ్య మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉండటంతో ఆంధ్రప్రదేశ్లో వర్షాల ప్రభావం పెరగనుంది. శనివారం, ఆదివారం కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత నుండి మధ్య మహారాష్ట్ర వరకు తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలపై నున్న ఉపరితల ఆవర్తనం మీదుగా ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో శనివారంనాడు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు.
శనివారం (27-06-2026) ఇలా..
శనివారంనాడు ఉత్తరాంధ్ర, కాకినాడ, కోనసీమ,మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు ఆస్కారం ఉంది.
ఆదివారం (28-06-2026) ఇలా..
ఆదివారంనాడు కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ వీలైనంత దూరంగా ఉండాలన్నారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు,శ్రామికులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు.
ఏపీ, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో వాతావరణం..
