Andhra Pradesh: ఈ మహిళ ఆచూకీ తెలిస్తే చెప్పండి.. కిడ్నాప్ కేసు దర్యాప్తులో పోలీసుల ‘సోషల్ మీడియా’ ప్రచారం

|

Sep 26, 2022 | 1:04 PM

పిల్లల అపహరణ కేసులు పోలీసులకు ఈమధ్య సవాలుగా మారాయి. 15 రోజుల క్రితం కృష్ణా జిల్లాలో ఐదు నెలల పసికందు కిడ్నాప్ కేసులో దర్యాప్తు వేగం పెంచినా, ఇప్పటిరవకు బాలుడి ఆచూకీ లభించలేదు. తాజాగా గుంటూరులో..

Andhra Pradesh: ఈ మహిళ ఆచూకీ తెలిస్తే చెప్పండి.. కిడ్నాప్ కేసు దర్యాప్తులో పోలీసుల సోషల్ మీడియా ప్రచారం
Boy Missing Case Police Release Photos
Follow us on

Andhra Pradesh: పిల్లల అపహరణ కేసులు పోలీసులకు ఈమధ్య సవాలుగా మారాయి. 15 రోజుల క్రితం కృష్ణా జిల్లాలో ఐదు నెలల పసికందు కిడ్నాప్ కేసులో దర్యాప్తు వేగం పెంచినా, ఇప్పటిరవకు బాలుడి ఆచూకీ లభించలేదు. తాజాగా గుంటూరులో కూడా ఐదేళ్ల బాలుడు మూడు రోజుల క్రితం అదృశ్యం అయ్యాడు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు కీలక ఆధారాలు లభించినా.. ఐదేళ్ల బాలుడిని తీసుకెళ్లిన మహిళా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులు తమ దర్యాప్తులో మహిళను పట్టుకోవడానికి సోషల్ మీడియాను ఎంచుకున్నారు. బాలుడిని తీసుకెళ్లిన మహిళ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేసి.. ఆమె ఆచూకీ తెలిస్తే తెలియజేయాలంటూ గుంటూరు పోలీసులు ప్రచారం చేస్తున్నారు. అరండల్ పేట ఐదో లైన్ లో మూడు రోజుల క్రితం ఐదేళ్ళ బాలుడు ప్రకాష్ అదృశ్యమయ్యాడు. దీంతో బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సిసి టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలుడిని ఒక మహిళ తీసుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో మహిళా ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

పిల్లాడికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ ఆచూకీ తెలిస్తే చెప్పాలంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు గుంటూరు పోలీసులు. ఇటీవల కాలంలో పిల్లల అపహరణ కేసులు ఎక్కువయ్యాయి. కొన్ని కేసులను గంటల వ్యవధిలోనే చేధించిన పోలీసులు.. కొన్ని కేసుల్లో మాత్రం దర్యాప్తు వేగంగా చేస్తున్నా ఫలితం కనబడటంలేదు. దీంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి పిల్లల కిడ్నాప్ కేసుల్లో దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

గుంటూరులో బాలుడు అదృశ్యానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..