R Narayana Murthy : సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటా : సినీ నటుడు, దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి

|

Mar 23, 2021 | 11:06 PM

R Narayana Murthy : ఏలేరు-తాండవ అనుసంధానంపై ప్రముఖ సినీనటుడు నారాయణమూర్తి స్పందించారు. తమ విజ్ఞప్తికి సీఎం జగన్ స్పందించారని ఆయన ఆనందం వ్యక్తం..

R Narayana Murthy : సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటా :  సినీ నటుడు, దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి
R Narayana Murthy Cm Jagan
Follow us on

R Narayana Murthy : ఏలేరు-తాండవ అనుసంధానంపై ప్రముఖ సినీనటుడు నారాయణమూర్తి స్పందించారు. తమ విజ్ఞప్తికి సీఎం జగన్ స్పందించారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అనుసంధానం కారణంగా పలు మండలాలకు నీటి సౌకర్యం ఏర్పడుతుందని నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు. ప్రజలతో పాటు తాను కూడా సీఎంకు రుణపడి ఉంటానని వ్యాఖ్యానించారు. ఏలేరు-తాండవ కాలువల అనుసంధానం ద్వారా సాగు, తాగునీటి సమస్యలు తీర్చాలని తాను ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో కలిసి సీఎం జగన్ కు విజ్ఞప్తి చేసిన విషయాన్ని నారాయణమూర్తి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తన విన్నపానికి సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని, వెంటనే నిధులు మంజూరు చేశారని అందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నానని నారాయణమూర్తి అన్నారు.

ఈ రెండు కాలువల అనుసంధానం వల్ల విశాఖ జిల్లాకు చెందిన కోట వూరుట్ల, నాతవరం, నర్సీపట్నం మండలాలు, తూర్పుగోదావరి జిల్లాలోని శంఖవరం, కోటనందూరు, ఏలేశ్వరం, రౌతులపూడి, ప్రత్తిపాడు మండలాలకు నీటి సౌకర్యం కలుగుతుందని చెప్పుకొచ్చారు. ఏలేరు-తాండవ పనుల నిమిత్తం రూ.470 కోట్లు సీఎం మంజూరు చేశారని, అందుకు సహకరించిన మంత్రులు కన్నబాబు, అనిల్ కుమార్ లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని నారాయణమూర్తి చెప్పారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా గానీ, కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలను పట్టించుకున్న పాపాన పోలేదని నారాయణ మూర్తి విమర్శించారు.

Read also :దేశం కాని దేశంలో తలదాచుకుంటున్న వారిపై పగబట్టిన విధి.. ప్రపంచంలోనే అతి పెద్ద రెఫ్యూజీ క్యాంప్ లో భారీ అగ్ని ప్రమాదం