Dussehra Holidays: విద్యార్థులకు గుడ్న్యూస్.. దసరా సెలవులను ప్రకటించిన ప్రభుత్వం
Dussehra School Holidays: ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం దసరా సందర్భంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటిస్తుంది. దాంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ సెలవులను కుటుంబంతో గడిపే అవకాశం లభిస్తుంది. ఈ సందర్భంగా హాస్టల్స్ లో ఉండే విద్యార్థులు తమ సొంతూళ్లకు వెళ్తారు. పాఠశాలలు, విద్యార్థులు..

Dussehra School Holidays: విద్యార్థులకు సెలవులు వస్తున్నాయంటే చాల పండగే. అలాంటిది ఇప్పుడు అంతా పండగ సీజన్ ఉంటుంది. దసరా సెలవులు ఎప్పుడెప్పుడు ప్రకటిస్తారా ? అని ఎదరు చూస్తున్న విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పింది ఏపీ సర్కార్. దసరా సెలవులను ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఉండనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 9 రోజుల పాటు విద్యార్థులకు దసరా సెలవులు ఇచ్చారు. అక్టోబర్ 3వ తేదీన పాఠశాలలు మళ్లీ ప్రారంభం కానున్నాయని ప్రభుత్వం ప్రకటించింది.
ఇది కూడా చదవండి: ITR Date Extension: చివరి నిమిషంలో గుడ్న్యూస్.. ఐటీఆర్ దాఖలుకు గడువు పొడిగింపు!
ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం దసరా సందర్భంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటిస్తుంది. దాంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ సెలవులను కుటుంబంతో గడిపే అవకాశం లభిస్తుంది. ఈ సందర్భంగా హాస్టల్స్ లో ఉండే విద్యార్థులు తమ సొంతూళ్లకు వెళ్తారు. పాఠశాలలు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ సెలవుల షెడ్యూల్ను గమనించి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు. సుదూర ప్రాంతాల్లో స్థిరపడిన అనేకమంది సైతం స్వగ్రామాలకి పిల్లల సెలవుల నేపథ్యంలో వారి కార్యాలయాలకు సైతం సెలవులు పెట్టుకుని వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.
ఇది కూడా చదవండి: PM Kisan: పీఎం కిసాన్కు సంబంధించి కేంద్రం కీలక నోటిఫికేషన్.. 21వ విడత ఎప్పుడు వస్తుంది?
ఇదిలా ఉంటే తెలంగాణలో కూడా 13 రోజుల పాటు దసరా సెలవులు ఉండనున్నాయి. ఈ నెల 21 నుంచి అక్టోబరు 3 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. అధికారికంగా మొత్తం 13 రోజులు పండగ సెలవులిచ్చారు. 4న బడులు పునఃప్రారంభమవుతాయి.
ఇది కూడా చదవండి: Viral Video: డ్రైవర్కు గుండెపోటు.. కారు గాల్లోకి ఎలా ఎగిరిందో చూడండి.. ఇలాంటి వీడియో ఎప్పుడు చూసి ఉండరు
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




