Tirumala Laddu: శ్రీవారి లడ్డూ అంశంపై సినీ హీరోల మధ్య డైలాగ్ వార్

తిరుమల లడ్డూ విషయంలో నెయ్యి కల్తీపై వైసీపీ నాయకులను తీవ్రంగా విమర్శించన పవన్‌ కల్యాణ్‌.. అనంతరం పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ప్రకాశ్‌రాజ్‌తో పాటు, సినిమా యాక్టర్లపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ఈ ఇష్యూలో మొదట పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్‌కి ప్రకాశ్ రాజ్ కౌంటర్ ఇచ్చారు.

Tirumala Laddu: శ్రీవారి లడ్డూ అంశంపై సినీ హీరోల మధ్య డైలాగ్ వార్
Pawan Kalyan Prakash Raj.jpeg

Edited By:

Updated on: Sep 24, 2024 | 8:34 PM

అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. హిందూ ధార్మిక సంఘాల నుంచి రాజకీయ నాయకుల వరకు ఈ వ్యవహారంపై మండిపడుతున్నారు. ఏపీలో రాజకీయంగా అట్టుడుకుతోంది. టీడీపీ, వైసీపీ నేతలు ఈపాపం మీదంటే మీదేనంటూ విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఓ అడుగు మందుకేసి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శుద్ధి కార్యక్రమం చేశారు పవన్‌ కల్యాణ్‌. ఈ క్రమంలో వైసీపీ నేతలపైనా, సినీ ప్రముఖులపైనా విమర్శలు గుప్పించారు. నెయ్యి కల్తీపై వైసీపీ నాయకులను తీవ్రంగా విమర్శించన పవన్‌ కల్యాణ్‌.. అనంతరం పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ప్రకాశ్‌రాజ్‌తో పాటు, సినిమా యాక్టర్లపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ఈ ఇష్యూలో మొదట పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్‌కి ప్రకాశ్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. ప్రియమైన పవన్ కల్యాణ్, మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలోనే ఈ ఘటన జరిగింది. నిందితులను కనిపెట్టి కఠిన చర్యలు తీసుకోండి. అంతేకానీ, లేనిపోని భయాలను వ్యాప్తి చేస్తూ జాతీయ స్థాయి సమస్యగా ఎందుకు మారుస్తున్నారు. ఇప్పటికే దేశంలో మతపరమైన ఆందోళనలు ఉన్నాయి అంటూ రెండు రోజుల క్రితం ట్వీట్ చేశారు. ఈ ఎక్స్ వార్‌లో వెంటనే మంచు విష్ణు ఎంటరయ్యారు. పవన్‌కి సపోర్ట్ చేస్తూనే.. ప్రకాశ్ రాజ్‌కి మీ పరిధిలో మీరు ఉండాలంటూ సున్నితంగా వార్న్ చేశారు. మరోవైపు...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి