AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srisailam Temple: కార్తీక పౌర్ణమి వేళ శివనామస్మరణతో మార్మోగుతున్న శ్రీశైలం.. జోతిర్లింగ దర్శనానికి పోటెత్తిన భక్తులు

శ్రీశైలంలో కార్తీక మాసం రెండవ సోమవారంతోపాటు కార్తీక పౌర్ణమి కావడంతో ద్వాదశ జోతిర్లింగమైన శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. మల్లికార్జునస్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. దర్శనానికి సుమారు 10 గంటల సమయం పడుతుంది.

J Y Nagi Reddy
| Edited By: Srikar T|

Updated on: Nov 27, 2023 | 1:27 PM

Share

శ్రీశైలంలో కార్తీక మాసం రెండవ సోమవారంతోపాటు కార్తీక పౌర్ణమి కావడంతో ద్వాదశ జోతిర్లింగమైన శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. మల్లికార్జునస్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. దర్శనానికి సుమారు 10 గంటల సమయం పడుతుంది. భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆలయం ముందు భాగంలోని గంగాధర మండపం, ఉత్తర శివమాడవీధిలో భక్తులు దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు.

కార్తీక సోమవారం పైగా పౌర్ణమి తిథి కావడంతో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భక్తులకు క్యూ లైన్లలో ఉచితంగా పాలు, అల్పాహారం ప్రసాదంగా అందచేస్తున్నారు. శని, అది, సోమవారాలలో స్పర్శ దర్శనం, సామూహిక, గర్భాలయా అభిషేకాలు రద్దు చేశారు దేవస్థానం అధికారులు. నేడు సోమవారం కావడంతో రద్దీ దృష్ట్యా భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. అలానే నేటి సాయంత్రం ప్రధానాలయానికి ఈశాన్య భాగంలో ఉన్న పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నాట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..