Cows Robbery: చిత్తూరు జిల్లాలో ఆవుల దొంగతనం.. ఆవుల కొట్టంలో తుపాకీ కలకలం..

|

Jun 25, 2021 | 2:30 PM

Cows Robbery: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఈ మధ్యకాలంలో ఆవులు, ఎద్దులను దొంగిలిస్తున్న ఘటనలు తరచుగా వెలుగు చూస్తున్నాయి.

Cows Robbery: చిత్తూరు జిల్లాలో ఆవుల దొంగతనం.. ఆవుల కొట్టంలో తుపాకీ కలకలం..
Chittoor
Follow us on

Cows Robbery: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఈ మధ్యకాలంలో ఆవులు, ఎద్దులను దొంగిలిస్తున్న ఘటనలు తరచుగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా జిల్లాలోని గంగవరంలో ఆవులు, ఎదులను దొంగిలించారు కొందరు దుండగులు. గాంధీనగర్‌లో 5 ఆవులు, 2 ఎద్దులను దొంగల ముఠా అపహరించుకెళ్లింది. అయితే, ఘటన జరిగిన పశువుల కొట్టంలో కంట్రీ మేడ్ రివాల్వర్ లభ్యమవడంతో గ్రామస్థులు ఉలిక్కి పడ్డారు. దుండగులు ఒకవేళ తాము దొరికితే కంట్రీమేడ్ రివాల్వర్‌తో జనాలను భయపెట్టి తప్పించుకోవచ్చునని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రివాల్వర్‌ను గమనించిన పోలీసులు.. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠా ఈ దోపిడీలకు పాల్పడి ఉండొచ్చని ప్రాథమిక అంచనాకు వచ్చారు.

కాగా, ఈ ముఠా గతంలోనూ తమిళనాడులోని వేలూరు పరిసర ప్రాంతాల్లో ఇలాంటి చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో అడ్డు వచ్చిన వారిపై దాడులుకు పాల్పడ్డట్లు గుర్తించారు. అలా తుపాకులను వెంటబెట్టుకుని గోవుల దొంగతనాలకు పాల్పడటం.. అడ్డుపడితే దాడులకు తెగబడటం చేస్తుంటారని పోలీసులు గుర్తించారు. కాగా, ఈ కిరాతక దొంగల ముఠా పట్ల ప్రజల తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వారికి సంబంధించిన రివాల్వర్ లభ్యమవడంతో.. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇదిలాఉంటే.. ఆవుల చోరీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Michael Jackson : మైకెల్ జాక్సన్ జీవితానికి సంబంధించి 10 ఆశ్చర్యకరమైన నిజాలు..! మీకు తెలుసా..?

AP ENC on Srisailam: తెలంగాణ నీటి వినియోగంపై ఏపీ లేఖ.. శ్రీశైలంలో జల విద్యుత్‌ ఉత్పత్తి ఆపించాలని డిమాండ్‌

వీడెవడండీ బాబు.! ‘క్రిస్ గేల్’ తమ్ముడులా .. 10 బంతుల్లో 50 పరుగులు బాదేశాడు..