Andhra Pradesh: స్కూల్స్‌లో కరోనా కలకలం.. మరో 26 మంది విద్యార్ధులకు పాజిటివ్ నిర్ధారణ..

దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో పలు రాష్ట్రాలు స్కూల్స్ పున: ప్రారంభించాయి. ఇదే కోవలో..

Andhra Pradesh: స్కూల్స్‌లో కరోనా కలకలం.. మరో 26 మంది విద్యార్ధులకు పాజిటివ్ నిర్ధారణ..
Corona Virus

Updated on: Aug 25, 2021 | 6:08 PM

దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో పలు రాష్ట్రాలు స్కూల్స్ పున: ప్రారంభించాయి. ఇదే కోవలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆగష్టు 16వ తేదీ నుంచి స్కూల్స్‌ను రీ-ఓపెన్ చేసింది. అయితే అక్టోబర్‌లో కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తుండటం.. తల్లిదండ్రుల్లో టెన్షన్ మొదలైంది.

ఇదిలా ఉంటే స్కూల్స్ పున: ప్రారంభంతో మరోసారి వైరస్ వ్యాప్తి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. పలు జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం రేగింది. మొన్నటికి మొన్న కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం జిల్లా పరిషత్ పాఠశాలలో 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా.. పెదపాలపర్రు జడ్పీ హైస్కూల్‌లో 10 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. ఇక తాజాగా బొబ్బిలి మున్సిపల్ పాఠశాలలో కరోనా కలకలం రేగింది. నాలుగో తరగతి చదువుతున్న 26 మంది విద్యార్ధులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీనితో అలెర్టయిన విద్యాశాఖ అధికారులు మిగిలిన విద్యార్ధులకు టెస్టులు నిర్వహిస్తున్నారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us