Andhra Pradesh: ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. మరోసారి కరెంట్ ఛార్జీలు తగ్గింపు.. చంద్రబాబు కీలక ప్రకటన

ఏపీలోని ప్రజలకు కూటమి సర్కార్ శుభవార్త అందించింది. రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలను మరింత తగ్గించనున్నారు. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. బుధవారం సచివాలయంలో కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని పలు కీలక సూచనలు చేశారు.

Andhra Pradesh: ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. మరోసారి కరెంట్ ఛార్జీలు తగ్గింపు.. చంద్రబాబు కీలక ప్రకటన
Power Charges

Updated on: Mar 11, 2026 | 5:25 PM

ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు భారీ గుడ్ న్యూస్ తెలిపారు. విద్యుత్ ఛార్జీలు, కొత్త ఇళ్ల ముంజూరుపై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే కరెంట్ ఛార్జీలను మరింత తగ్గించనున్నట్లు కలెక్టరల్ సమావేశంలో చంద్రబాబు వెల్లడించారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలను తగ్గించి ప్రజలపై భారం పడకుండా చూశామని, త్వరలోనే మరింతగా తగ్గించి ఊరట కలిగిస్తామని స్పష్టం చేశారు. సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తామని, ఆ దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. దీని వల్ల సామాన్యులపై ధరల భారం తగ్గి లబ్ది చేకూరుతుందన్నారు.

ఉగాదికి ఇళ్ల గృహప్రవేశాలు

వైసీపీ ప్రభుత్వం ట్రూఅప్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలను పెంచిందని, కానీ తాము అధికారంలోకి వచ్చాక ట్రూడౌన్ విధానం పాటిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. వచ్చే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గుతాయని స్పష్టం చేశారు. ఇక పేదలకు ఇళ్ల మంజూరుపై చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. త్వరలో రానున్న ఉగాది నాటికి 2 లక్షల 50 వేల ఇళ్లకు గృహప్రవేశాలు చేయిస్తామన్నారు. సూపర్ సిక్స్ పథకాలను సమర్థవంతగా అమలు చేస్తున్నామని, ఈ కార్యక్రమాలన్నీ ప్రజలకు చేరువ అయ్యేలా ప్రచారం కల్పించాలని కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ పథకాల నుంచి లబ్ది పొందేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ 20 నెలల పాలనలో తాము అనేక మార్పులు పాలనాపరంగా చేసినట్లు స్పష్టం చేశారు. తాము అమలు చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలు దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరుస్తాయని పేర్కొన్నారు.

ప్రభుత్వ పథకాల్లో పొరపాట్లు జరగకూడదు

ఇక ప్రభుత్వ పథకాల అమల్లో పొరపాట్లు జరగకూడదని సీఎం చంద్రబాబు తెలిపారు. 2047 స్వర్ణాంధ్ర విజన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఇందులో భాగంగా 10 సూత్రాల అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను క్షేత్రస్థాయిలో ప్రభావవంతంగా అమలయ్యేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. కాగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలుమార్లు విద్యుత్ ఛార్జీలను తగ్గించింది. విడతల వారీగా ఛార్జీలను తగ్గించే కార్యక్రమాన్ని కూటమి సర్కార్ చేపడుతోంది. అటు పీఎం ఆవాస్ యోజన పథకంతో కలిపి రాష్ట్రంలోని పేదలకు గృహ నిర్మాణ పథకాన్ని అమలు చేస్తోంది. పేదలు నిర్మించుకునే ఇళ్లకు ఆర్ధిక సాయం చేయడంతో పాటు స్థలం లేనివారికి స్థలం ఉచితంగా అందించి ఇల్లు నిర్మిస్తోంది. ఉగాదికి కొత్త ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఇటీవల ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. దీంతో వీటి కోసం పేదలు ఎదురుచూస్తున్నారు.

Follow Us