వాళ్లున్నారన్న ధైర్యంతోనే చంద్రబాబు మాట్లాడుతున్నారు.. స్పీకర్‌ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు

|

May 30, 2023 | 9:36 AM

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు భద్రతపై ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు జడ్ ప్లస్ కేటగిరి భద్రత పొందే అర్హత బాబుకు ఉందా..? అంటూ ప్రశ్నించారు.

వాళ్లున్నారన్న ధైర్యంతోనే చంద్రబాబు మాట్లాడుతున్నారు.. స్పీకర్‌ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు
Chandrababu - Thammineni Seetharam
Follow us on

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు భద్రతపై ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు జడ్ ప్లస్ కేటగిరి భద్రత పొందే అర్హత బాబుకు ఉందా..? అంటూ ప్రశ్నించారు. దేశంలో థ్రెట్ ఉన్న వాళ్లందరికి జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించారా?.. అంటూ వ్యాఖ్యానించారు. అధికారం లేకపోతే చంద్రబాబు విలవిలలాడుతారని.. తమ్మినేని పేర్కొన్నారు. బ్లాక్‌ కమాండోలను తీసేస్తే చంద్రబాబు పరిస్థితి ఏంటి? .. వాళ్లున్నారన్న ధైర్యంతో బాబు మాట్లాడుతున్నారంటూ తమ్మినేని సీతారాం ఫైర్ అయ్యారు. ఎవరిని ఉద్దరించడానికి చంద్రబాబుకు బ్లాక్‌ కమాండోలు? అంటూ తమ్మినేని విరుచుకుపడ్డారు.

చంద్రబాబు నాయుడు భద్రతపై మాట్లాడిన సభాపతి తమ్మినేని సీతారాం ఎవరిని ఉద్ధరించటానికి బాబుకు బ్లాక్ కమాండోస్ ఇచ్చారని.. దేశంలో ఎంతోమందికి బెదిరింపులు ఉన్నాయని చంద్రబాబు ఏమైనా వ్యవస్థలకు అతీతుడా అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడుకు బ్లాక్ కమాండోస్ భద్రత తొలగించాలని.. ఏపీ స్పీకర్‌గా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తానంటూ తమ్మినేని స్పష్టం చేశారు.

బ్లాక్ కమాండోస్ ఉన్నారనే చంద్రబాబు రెచ్చిపోయి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన తమ్మినేని.. బ్లాక్ కమాండోస్ లేకుండా చంద్రబాబు బయట తిరగగలరా అంటూ ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..