AP IIIT Admissions 2023: ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో 2023-24 అడ్మిష‌న్లకు నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

|

Jun 04, 2023 | 1:37 PM

ఆంధ్రప్రదేశ్‌ రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలో 2023-24 విద్యాసంవత్సరానికి ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు జూన్‌ 4న నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ రోజు (జూన్‌ 4) నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభ..

AP IIIT Admissions 2023: ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో 2023-24 అడ్మిష‌న్లకు నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
Nuzvid RGUKT
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలో 2023-24 విద్యాసంవత్సరానికి ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు జూన్‌ 4న నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ రోజు (జూన్‌ 4) నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఎవరైనా ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తారని ఆర్జీయూకేటీ కులపతి ఆచార్య కేసీ రెడ్డి వెల్లడించారు. జూన్‌ 26వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

ఏపీ ఆర్జీయూకేటీ- 2023 అడ్మిషన్‌ షెడ్యూల్‌ ఇదే..

  • ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణ తేదీ: జూన్ 4, 2023.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 26, 2023.

ప్రత్యేక కేటగిరీ అభ్యర్ధుల దరఖాస్తు స్వీకరణ తేదీలు..

  • సైనిక కోటా: జులై 5, 2023.
  • క్రీడా కోటా: జులై 6, 2023.
  • దివ్యాంగుల కోటా: జులై 6, 2023.
  • భారత్‌ స్కౌట్స్‌ అండ్ గైడ్స్‌ కోటా: జులై 6, 2023.
  • ఎన్సీసీ కోటా: జులై 5 నుంచి 7 వరకు, 2023.
  • తాత్కాలిక ఫలితాల ప్రకటన: జులై 13, 2023.

ఎంపికైన అభ్యర్ధుల ధ్రవపత్రాల పరిశీలన..

  • నూజివీడు క్యాంపస్: జులై 21, 22 తేదీల్లో
  • ఇడుపుల పాయ క్యాంపస్‌: జులై 21, 22 తేదీల్లో
  • ఒంగోలు క్యాంపస్: జులై 24, 25 తేదీల్లో
  • శ్రీకాకుళం క్యాంపస్: జులై 24, 25 తేదీల్లో

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.