Andhra Lockdown: ఏపీలో మ‌రో రెండు వారాలు లాక్ డౌన్ పొడిగింపు.. నేడు లేదా రేపు స‌ర్కార్ ఉత్త‌ర్వులు !

|

May 28, 2021 | 3:58 PM

క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా ప్ర‌స్తుతం ఏపీలో లాక్ డౌన్ అమ‌ల‌వుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఉద‌యం 6 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు...

Andhra Lockdown:  ఏపీలో మ‌రో రెండు వారాలు లాక్ డౌన్ పొడిగింపు.. నేడు లేదా రేపు స‌ర్కార్ ఉత్త‌ర్వులు !
Ap Government
Follow us on

క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా ప్ర‌స్తుతం ఏపీలో లాక్ డౌన్ అమ‌ల‌వుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఉద‌యం 6 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు మాత్రం లాక్ డౌన్ నుంచి స‌డ‌లింపు ఉంది. ఈ స‌డ‌లింపు స‌మ‌యంలో కూడా 144 సెక్ష‌న్ అమలులో ఉంటుంది. కాగా రాష్ట్రంలో లాక్ డౌన్‌ను మ‌రో రెండు వారాలు లేదా మూడు వారాలు పెంచే అవకాశం ఉన్నట్లు స‌మాచారం అందుతుంది. దీనిపై శుక్ర‌వారం లేదా శ‌నివారం అధికారికంగా ప్రకటన విడుదల చేయనుంది ప్రభుత్వం. కాగా ఏపీలో కేసుల సంఖ్య పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. అందుకే ప్ర‌భుత్వం ఈ దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లు తెలుస్తుంది. కాగా రాష్ట్రంలో లాక్ డౌన్ ను క‌ఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు. ఈ పాస్ లేకుండా బ‌య‌ట తిరుగుతున్నవారిపై చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

అతి చేస్తే.. క‌ఠిన చ‌ర్య‌లు.. ప్రవేట్ ఆస్ప‌త్రుల‌కు సీరియ‌స్ వార్నింగ్..

నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు ఆస్పత్రులు డబ్బులు వసూలు చేస్తే…పది రెట్లు జరిమానా విధించాలని జ‌గ‌న్ ఉత్తర్వులు జారీ చేసింది. రెండోసారి తప్పుచేస్తే క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని….వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎ.కె.సింఘాల్ స్పష్టం చేశారు. వైద్యారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని….కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లకు ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read: కరోనా బాధితులకు దడ పుట్టించే వార్త… ICMR సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడి

పరీక్షల రద్దుపై పిటిషన్.. విచారణను వాయిదా వేసిన సుప్రీం కోర్టు..