AP Panchayat Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. శనివారం నుంచి మూడో విడత నామినేష్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 13 జిల్లాలు, 19 రెవెన్యూ డివిజన్లు, 3225 గ్రామ పంచాయతీల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి.
ఫిబ్రవరి 8 – నామినేషన్ల దాఖలుకు తుది గడువు
ఫిబ్రవరి 9- నామినేషన్ల పరిశీలన
ఫిబ్రవరి 10- అభ్యంతరాల పరిశీలన
ఫిబ్రవరి 11- అభ్యంతరాలపై తుది నిర్ణయం
ఫిబ్రవరి 12- నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
ఫిబ్రవరి 17-ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్
ఫిబ్రవరి 17..సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాలు
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 3,249 గ్రామపంచాయతీలకు తొలి విడతలో ఎన్నికలు జరగాల్సి ఉండగా 517 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏకంగా 20 శాతం ఏకగ్రీవాలు జరిగాయి. చిత్తూరు జిల్లాలో తొలి దశలో 454 పంచాయతీలకు 112 ఏకగ్రీవమయ్యాయి. అంటే 24 శాతం పంచాయతీల్లో ఏకగ్రీవాలు జరిగాయి. గుంటూరు జిల్లాలో 337 పంచాయతీలకు 67 ఏకగ్రీవమయ్యాయి.
అంటే దాదాపు 20 శాతం ఏకగ్రీవాలు జరిగాయి. ఇంత పెద్ద సంఖ్యలో ఏకగ్రీవాలు జరగడాన్ని అనుమానించిన ఎస్ఈసీ కొత్త ట్విస్ట్ ఇచ్చింది. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏకగ్రీవాలపై వెంటనే నిర్ణయం తీసుకోవద్దని కలెక్టర్లను ఆదేశించింది. ప్రతి పంచాయతీపై పూర్తి స్థాయిలో నివేదిక వచ్చాక నిర్ణయం ఉంటుందని సీఈసీ తెలిపింది. మళ్లీ ఆదేశించే వరకు ఫలితాలు ప్రకటించవద్దని ఎస్ఈసీ స్పష్టం చేసింది.